వైఎస్ షర్మిలా రెడ్డి, APCC చీఫ్
విజయసాయి రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు
జగన్ ఏ పని ఆదేశిస్తే…ఆ పని చేయడం..ఎవరిని తిట్టమంటే వాళ్ళను తిట్టడం సాయి రెడ్డి పని
రాజకీయంగా కాదు..వ్యక్తిగతంగా కూడా..నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయి రెడ్డి
ఈ అబద్ధాలు జగన్ చెప్తే సాయి రెడ్డి చెప్పాడు
ఇలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశాడు అంటే చిన్న విషయం కాదు
వైసిపి కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయండి
జగన్ ను విజయసాయి రెడ్డి వదిలేశారు అంటే ఎందుకు ?
సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారు ?
ప్రాణం పెట్టిన వాళ్ళు ఎందుకు జగన్ ను వీడుతున్నారు ?
జగన్ నాయకుడుగా విశ్వసనీయత కోల్పోయారు
నాయకుడుగా ప్రజలను, నమ్ముకున్న వాళ్ళను మోసం చేశారు
నా అనుకున్న వాళ్ళను కాపాడుకోలేక పోతున్నాడు
జగన్ బీజేపీ కి దత్త పుత్రుడు
తనను తాను కాపాడుకోవడానికి సాయి రెడ్డిని బీజేపీ కి పంపడు
ఇన్నాళ్లు సాయి రెడ్డి నీ పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు
జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే సాయి రెడ్డి వెళ్ళిపోయాడు
సాయి రెడ్డి బయటకు వచ్చాడు..నిజాలు చెప్పాలి
మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అని మీకు తెలుసు
వివేకా హత్య విషయంలో నిజం చెప్పినందుకు సంతోషం
మిగతా విషయాలు కూడా బయట పెట్టండి