విజయవాడలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ, హెచ్ ఆర్ డి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే పరేడ్ శకటాల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శకటానికి తృతీయ స్థానం దక్కింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నుంచి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ , కమిషనర్ కృష్ణతేజ పురస్కారం స్వీకరించారు