శనివారం 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని పోలీసు పరేడ్ మైదానంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు.
ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, రెవెన్యూ, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.