26-1-2025
ఈ రోజు మనకు భారత రాజ్యాంగం అందించిన విలువలను గుర్తుచేసే రోజు
*న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం వంటి ముఖ్య విలువలు ప్రతి పౌరుడికి ఆత్మగౌరవాన్ని మరియు హక్కులను అందిస్తున్నాయి MLA బొండా ఉమ*
ధి:26-1-2025 ఆదివారం ఈరోజు ఉదయం 9:30″గం నుండి ” సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్ లలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కూటమి నేతలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, పిల్లలకు నోట్ బుక్స్, చాక్లెట్లు బిస్కెట్ ప్యాకెట్లు మరియు వృద్ధులకు మహిళలకు చీరలు పంపిణీ చేసి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ రాజ్యంగా అవతరించిన రోజు జనవరి 26 సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి భారత రాజ్యాంగం ప్రతీక గా గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటామని,75 ఏళ్లుగా రాజ్యాంగం మన దేశానికి సమగ్ర దిశానిర్దేశం చేస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తిని శాశ్వతంగా వర్ధిల్లేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.
గణతంత్ర దినోత్సవం మన దేశానికి చెందిన త్యాగధనుల్ని స్మరించడానికి ఒక గొప్ప అవకాశం, స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానుభావులు, వారు చేసిన త్యాగాలు, దేశానికి అందించిన సేవలు ప్రతి భారతీయుడికి గర్వకారణం అని, ఈ రోజు మన బాధ్యతలను గుర్తుచేసే రోజు రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు, సమాజానికి సేవ చేయడం ప్రతి పౌరుడి కర్తవ్యం అని, మన అందరం కలసి భారతదేశాన్ని మరింత బలమైన, సమర్థవంతమైన, మరియు ప్రగతిశీల దేశంగా తీర్చిదిద్దాలి అని బొండా ఉమ ప్రజలకు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, వందలాదిమంది ప్రజలు పాల్గొన్నారు