26.01.2025 విజయవాడ
గరియాబంద్ హత్యాకాండపై న్యాయ విచారణ జరపాలి..
మధ్యభారతంలో ఆదివాసీలపై వనరుల కోసం జరుగుతున్న యుద్ధం ఈరోజు ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఛత్తీస్గఢ్ – ఒడిశా సరిహద్దుల్లో గరియాబంద్ ప్రాంతాన్ని వందలాది బలగాలు చుట్టుముట్టి సాగించిన హింసాకాండను అందరం ఖండించాలి. దాదాపు మూడు రోజులు ఈ ప్రాంతాన్ని బలగాలు తమ అదుపులోకి ఉంచుకుని అక్కడ పట్టుబడిన మావోయిస్టులను చంపుతూ మరణాల సంఖ్యపై రోజుకు ఒక ప్రకటన చేస్తూ భయోత్పాదం సృష్టించడానికి ప్రయత్నించాయి. మావోయిస్టుల ఏరివేత చర్యల్లో దీనిని ఒక గొప్ప ముందడుగుగా కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటన చేసి.. అక్కడ నిజంగానే ఏదో జరిగిపోతున్నదన్న వాతావరణాన్ని కల్పించాలని ప్రయత్నించాడు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ రెండు కర్రల సాయంతో మాత్రమే నడవగలిగిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిని హతమార్చడాన్ని గొప్ప ముందంజ చర్యగా రాజ్యం ప్రకటిస్తుండటం దాని ఫాసిస్టు స్వభావాన్ని తెలియజేస్తోంది. చలపతి హత్యను ఆధారం చేసుకుని ఒక ఉద్యమం అణగిపోయిందనీ, దండకారణ్యం తన పోరాటాన్ని ఓడిపోయిందని గోదీషా మీడియా పనిగట్టుకుని గందరగోళం సృష్టించాలని చూస్తోంది. ఒకవైపు మావోయిస్టుల ఏరివేత పేరిట పెద్దెత్తున ఆదివాసీలపైనా, అంతిమంగా దేశ ప్రజలపై యుద్ధం జరుగుతున్న సమయమిది. ఆలోచించగల ప్రతి ప్రాణి కదిలి, ఐక్యంగా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాల్సిన సమయమిద