విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మహా జనసభ జరిగింది
. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి జర్నలిస్టు సభ్యులు హాజరయ్యారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపి ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా నున్న గ్రామ పరిధిలో సొసైటీ భూమిలో ఆక్రమణలు పరిశీలించి…అక్రమ నిర్మాణాలు పై రూరల్ ఎమ్మార్వో తో మాట్లాడి సత్వరమే ఆక్రమణలు తొలగించాలని అదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ అందరి సమస్య ల పై వార్తలు రాసే జర్నలిస్టు లు.. తమ ఇబ్బందులు గురించి రాయలేరని అన్నారు. వైయస్ హయాంలో జర్నలిస్టు సొసైటీ కి స్థలం ఇస్తూ జీవో ఇచ్చారని…2014-19 మధ్య ఆనాటి టిడిపి ప్రభుత్వం మరో జిఒ ఇచ్చిందని గుర్తు చేశారు . 17 యేళ్లుగా పోరాటం చేస్తున్నా ఇంతవరకు సోసైటి స్ధలం ఇంకా జర్నలిస్టులకు అందకపోవడం బాధాకరం అని అన్నారు . తన నియోజకవర్గం లో ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామి ఇచ్చారు . అసెంబ్లీ లో ప్రశ్న లేవనెత్తి… సిఎం దృష్టి కి అంశాన్ని తీసుకెళతానని చెప్పారు . యేడాది కాలంలో ఈ సమస్య కు పరిష్కారం అయ్యేలా చూస్తానని అన్నారు. జర్నలిస్టు లు కూడా సమాజానికి ఉపయోగపడే వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, జర్నలిస్టు ల భూములు ఆక్రమణలు గురి కావడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు .జర్నలిస్టు సొసైటీ సభ్యులు కూడా తమ స్థలం సాధించుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.