Home Political news విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార...

విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మహా జనసభ జరిగింది

4
0

 విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మహా జనసభ జరిగింది

.  ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి జర్నలిస్టు సభ్యులు హాజరయ్యారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపి ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా నున్న గ్రామ పరిధిలో సొసైటీ భూమిలో ఆక్రమణలు పరిశీలించి…అక్రమ నిర్మాణాలు పై రూరల్  ఎమ్మార్వో తో మాట్లాడి సత్వరమే ఆక్రమణలు తొలగించాలని అదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ  వెంకట్రావ్ మాట్లాడుతూ అందరి సమస్య ల పై వార్తలు రాసే జర్నలిస్టు లు.. తమ ఇబ్బందులు గురించి రాయలేరని అన్నారు. వైయస్ హయాంలో జర్నలిస్టు సొసైటీ కి స్థలం ఇస్తూ జీవో ఇచ్చారని…2014-19 మధ్య ఆనాటి టిడిపి ప్రభుత్వం మరో జిఒ ఇచ్చిందని గుర్తు చేశారు . 17 యేళ్లుగా పోరాటం చేస్తున్నా ఇంతవరకు సోసైటి స్ధలం ఇంకా  జర్నలిస్టులకు అందకపోవడం బాధాకరం అని అన్నారు . తన నియోజకవర్గం లో ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామి ఇచ్చారు . అసెంబ్లీ లో ప్రశ్న లేవనెత్తి… సిఎం దృష్టి కి అంశాన్ని తీసుకెళతానని చెప్పారు . యేడాది కాలంలో ఈ సమస్య కు పరిష్కారం అయ్యేలా చూస్తానని అన్నారు. జర్నలిస్టు లు కూడా సమాజానికి ఉపయోగపడే వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, జర్నలిస్టు ల భూములు ఆక్రమణలు గురి కావడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు .జర్నలిస్టు సొసైటీ సభ్యులు కూడా తమ స్థలం సాధించుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here