*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ తేది. 26.01.2025.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్
ది.26.01.2025వ తేదీన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించగా, పోలీస్ బ్యాండ్ వారు లయబద్ధంగా జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్. జిల్లా నగర పోలీస్ కమీషనరేట్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను పోలీస్ కమీషనర్ తెలియజేసి అనంతరం పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి మిఠాయిలు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తోపాటు డి.సి.పి.లు కె.ఎం.మహేశ్వర రాజు ఐ.పి.ఎస్. తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్ ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి ఐ.పి.ఎస్. మనీషా ఐ.పి.ఎస్. కృష్ణ మూర్తి నాయుడు ఎస్.వి.డి.ప్రసాద్ , ఎ.ఆర్.ఎ.డి.సి.పి. కె.శ్రీనివాసరావు , ఏ.సి.పి.లు ఎస్.కిరణ్ కుమార్ వెంకటేశ్వర రావు కృష్ణం రాజు డి.ప్రసాద రావు ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐ.లు, ఎస్.ఐ.లు, స్పెషల్ బ్రాంచ్, సి.సి.ఆర్.బి., పరిపాలనా విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.