Home Political news శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ఆధ్వర్యంలో వరదలలో నష్టపోయిన చిరు వ్యాపారులకు తోపుడు బళ్ళు, మహిళలకు కుట్టు...

శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ఆధ్వర్యంలో వరదలలో నష్టపోయిన చిరు వ్యాపారులకు తోపుడు బళ్ళు, మహిళలకు కుట్టు మిషన్

4
0

 26-1-2025

ధి:26-1-2025 ఆదివారం ఉదయం 11:30″ గం లకు ” సెంట్రల్ నియోజకవర్గంలోని 62 వ డివిజన్ NGO కాలని నందు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ వారు 2024 సెప్టెంబర్ లో 63,62 డివిజన్ లకు సంబంధించి విజయవాడ వరదల లో ప్రకృతి విపత్తుల బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ఆధ్వర్యంలో వరదలలో నష్టపోయిన చిరు వ్యాపారులకు తోపుడు బళ్ళు, మహిళలకు కుట్టు మిషన్

లు, కూరగాయల బళ్ళు, సెలూన్ షాప్ వారికి అవసరమైన సామాగ్రి, కిళ్ళి కొట్టు వారికి పచారి సామాన్లు, అలాగే టిఫిన్ బళ్ళు ఇడ్లీ పాత్రలు, కళాయిలు గ్యాస్ పొయ్యిలు, సైకిల్ షాప్ మరియు మోటారు సైకిల్ మెకానికులకు కావలసినటువంటి సామాన్లు రెండు గాలి మోటార్లు , ఇస్త్రీ బళ్ళు ఇస్త్రీ పెట్టెలు వంటివి అందజేయడం జరిగినది.

 ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ:-యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్ సంస్థ‌ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో నిత్యం పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉంటుందని, డ్వాక్రా సంఘాల ద్వారా ఎంతోమంది మహిళలకు ఉచితంగా శిక్షణ అందించి కుట్టు మిషన్లు, విపత్కర సమయాలలో అందిస్తారని, విజయవాడ వరద సమయంలో ఎన్నో ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలకు ఆనాడు కూడా యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ వారు ప్రకాష్ నగర్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమందికి ఆహారం, నీ రు, పాలు, బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు మరియు ఇతర అవసరమైనటువంటి సరుకులను అందజేశారని.

 ఈరోజు కూడా నియోజకవర్గంలోని నాయి బ్రాహ్మణులకు కావలసినటువంటి కుర్చీలను, సెలూన్లకు కావలసినటువంటి సామాన్లను, ఏసీ మిషన్లను, అందించి ఇంతమంది కి తిరిగి జీవనోపాధి కల్పించడం అనేది చాలా సంతోషమని, ఆనాడు వరదల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం చేస్తా అన్న సహాయాన్ని నేడు చేస్తూ మాట నిలబెట్టుకున్నటువంటి ఈ సంస్థను బొండా ఉమా అభినందించి భవిష్యత్తులో కూడా ఈ సేవా సంస్థ వారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు తోడుగా నిలవాలని తెలియజేశారు

 ఈ కార్యక్రమంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సీఈవో రేఖ శ్రీనివాస్, యాజమాన్యం భారత్ మెరుగు, రాములు, ప్రశాంత్, రమేష్ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు తొట్టెంపూడి ఉదయ్ శంకర్,EX కార్పొరేటర్ పైడి తులసి, డివిజన్ ఇంచార్జ్ పైడి శ్రీను, బత్తుల కొండ, బుల్లెద్దుల రవిచంద్ర, మీసాల రామకృష్ణ, లబ్బా వైకుంఠం, మోతుకూరి కాసిం, చీర బోయిన రాజా, సాయి, మోదుగుల గణేష్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here