గణతంత్ర దినోత్సవం సందర్భంగా 49 వ డివిజన్ పరిధిలోని మట్టా లాజర్ స్కూల్ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ బుల్లా
విజయ్ కుమార్ పాల్గొని ముందుగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూజ కార్యక్రమం నిర్వహించి తదుపరి జెండా ఆవిష్కరణ చేసి చిన్నారులను ఉద్దేశించి ఇప్పటి చిన్నారులె రేపటి దేశానికి సేవ చేసే గొప్ప IAS,IPS, డాక్టర్, సైంటిస్ట్ లగా దేశానికి సేవ చేయాలని మాట్లాడటం జరిగింది చిన్నారులు ప్రదర్శించిన డ్యాన్స్, స్పీచ్, పాటలు పాడిన, నిర్వహించిన చిన్నారులను అభినందించి మట్టా లాజర్ స్కూల్ నందు కావల్సిన అన్ని సౌకర్యాలు కేంద్ర మాజీ మంత్రి వర్యులు, స్థానిక బిజెపి MLA యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి ) దృష్టికి తీసుకు వెళ్లి స్కూల్ కి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలియ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చిన్నారులకు అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బసవేశ్వర్ రావు ఉపాధ్యాయులు రమేష్ , మాధురి పాల్గొన్నారు