Home Political news ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ

ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ

3
0

 ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ

పేదలందరికీ ఇళ్లు పథకం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించారు. అందులో నిరుపయోగంగా ఉన్నవి లేదా ఇళ్ల నిర్మాణాలకు అనుకూలంగా ఉన్న వాటిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల భూసేకరణ భారం తగ్గుతుంది. పేదింటి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చేవారుంటే సంప్రదించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌లో అందుబాటులో ఉన్న భూములను వినియోగించుకోవాలని సూచించింది. 

చివరి ప్రయత్నంగానే అసైన్డ్‌ భూములపై దృష్టిపెట్టాలని ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు గ్రామకంఠం పరిధిలో ఇళ్ల స్థలాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని రెవెన్యూ శాఖ స్పష్టత ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here