Home Crime News ర్యాలీని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర బాబు ఐ. పి. ఎస్.

ర్యాలీని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర బాబు ఐ. పి. ఎస్.

3
0

 ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. తేదీ. 28-01-2025.

రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా ది కృష్ణ డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర బాబు ఐ. పి. ఎస్.

సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ అదే విధంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై ప్రజలకు, ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు, మరియు పాఠశాలల విద్యార్ధినీ విద్యార్థులకు, ఆటో, లారీ మరియు ఆర్.టి.సి. డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుకొనుచున్నాము. 

 ఈ నేపథ్యంలో ప్రజలకు రోడ్ సేఫ్టీ మరియు భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు ది కృష్ణ డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగమోతు రాజా ఆధ్వర్యంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ నుండి బందర్ రోడ్డు లోని పి.డబ్ల్యు.డి గ్రౌండ్ వరకు సుమారు 200 మందితో రోడ్ సేఫ్టీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

 ఈ ర్యాలీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐపీఎస్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది.

 ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ….. హైకోర్టు ఆదేశాల మేరకు మార్చ్ ఒకటి నుంచి జరిమానాలు మారతాయి. హెల్మెట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడ్ ,త్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ లాంటి విషయాలలో జరిమానా పెరగటమే కాక జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేసి తీరుతాం. రవాణా శాఖ నిర్వహిస్తున్న 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా పోలీస్ మరియు రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని నిబంధన కఠినంగా అమలు చేస్తాం. ప్రస్తుతం నగరంలో 84 శాతం వాహనదారులు హెల్మెట్ వాడుతున్నారు. అస్త్రం అనే ఆర్ట్ ఫీషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్ వేర్ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. ఫ్లెక్సీలు అవగాహన ర్యాలీలు ఇతర కళారూపాల ద్వారా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నాము.

రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారే మృత్యువాత పడుతున్నారన్నారు. దీనికి ప్రధాన కారణం ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్ దరించకపోవడమేనన్నారు. ద్విచక్ర వాహనంపై ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. ఇంటి పెద్దదిక్కును కోల్పోతే ఆ నరకం వేరేగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు ఒక్కరినే బలిగొనవు, మొత్తం కుటుంబాన్నే విచ్ఛిన్నం చేస్తాయన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను నిత్యం కళ్లముందు చూస్తూనే ఉంటాం. నష్టం జరిగిన అనంతరం ఆలోచించే కంటే ముందే జాగ్రత్త పడితే మంచిదన్నారు. జరిమానాలు, కేసులకు భయపడి చాలా మంది హెల్మెట్‌ను కొంటున్నా, వాటిని వినియోగించడంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. వెంట తెచ్చుకుని పోలీసులు కనిపిస్తే ధరించడం, లేదంటే బండి హ్యాండిల్‌కు తగిలించుకోవడం జరుగుతోందన్నారు. హెల్మెట్‌ ధరించకపోవటంతో ద్విచక్ర వాహన దారులు మృత్యువాత పడుతున్నారన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ తో పాటు, ట్రాఫిక్ డిసిపి కృష్ణమూర్తి నాయుడు , ఏ డి సి పి  ఏ. వి. ఎల్

 ప్రసన్నకుమార్ , రవాణా శాఖ అధికారులు, ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ మరియు ఎన్ సి.సి విద్యార్థిని విద్యార్థులు సుమారు 200 వరకు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here