Home Political news రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం మొదటి దఫాలో పౌరులకు...

రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం మొదటి దఫాలో పౌరులకు అందుబాటులోకి 161 సేవలు

3
0

 రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం 

మొదటి దఫాలో పౌరులకు అందుబాటులోకి 161 సేవలు

వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, జనవరి 29  వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్‌లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. 

దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి అన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here