Home Political news కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలు

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలు

4
0

 కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలు 

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థలం, వసతుల అధ్యయనం చేయాలని అధికారులకు కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా అదేశాలు జారీ చేశారు. హైకోర్టుకు కావాల్సిన అన్ని వసతులు ఉండే స్థలం కోసం అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు ఏపి ఈఆర్సి, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ భవనాలు పరిశీలించిన అధికారులు.

 శ్రీ బాగ్‌ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఈనాటిది కాదు. స్వాతంత్ర్యానికి పూర్వమే 1937 నుంచి సీమ ప్రజల హృదయాల్లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here