ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ తేదీ.03.02.2025
తక్కువ సమయంలో కేసులను చేధించడంలో కీలకంగా వ్యవహరించిన క్రైమ్ సిబ్బందిని నగదు రివార్డ్ లతో అభినందించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.
ఈ మధ్య కాలంలో ఎన్.టి.ఆర్.జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు దొంగతనం కేసులలో తక్కువ సమయంలో నేరస్తులను పట్టుకోవడంతో పాటు చోరీ సొత్తును రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించి,విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనపరిచిన 10 మంది క్రైమ్ పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి ఈ రోజు ది.03.02.2025వ తేదీన పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఈ క్రింది తెలిపిన వారిని ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డ్ లను అందించడం జరిగింది.
నగదు రివార్డ్ లను పొందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం వారి వివరాలు
1. బి.వి.స్వామి – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్
2. సి.హెచ్.సత్యనారాయణ – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్
3. ఎస్.కృష్ణమూర్తి – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్
4. యం.ప్రకాష్ రావు – హెడ్ కానిస్టేబుల్
5. జె.నాగరాజు – హెడ్ కానిస్టేబుల్
6. వి.రవికుమార్ – హెడ్ కానిస్టేబుల్
7. జి.సురేష్ – కానిస్టేబుల్
8. వి.వి.రమణ – కానిస్టేబుల్
9. షేక్ షబ్బీర్ – కానిస్టేబుల్
10. జి.శిరీష – మహిళా కానిస్టేబుల్
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తోపాటు క్రైమ్ డి.సి.పి. తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్. క్రైమ్ ఎ.డి.సి.పి. ఎం.రాజారావు సి.సి.ఎస్.ఇన్స్పెక్టర్ ఎం.రాంకుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.