Home Political news రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా 96 శాతం అర్జీల‌ను ప‌రిష్క‌రించాం

రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా 96 శాతం అర్జీల‌ను ప‌రిష్క‌రించాం

2
0

 *ఎన్‌టీఆర్ జిల్లా, ఫిబ్ర‌వ‌రి 04, 2025*

రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా 96 శాతం అర్జీల‌ను ప‌రిష్క‌రించాం

– ప్ర‌జ‌ల భూ హ‌క్కుకు భ‌రోసా క‌ల్పించేలా స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం

– త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌లను ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ప‌రిష్కారానికి కృషి

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

జిల్లాలో 33 రోజుల పాటు జ‌రిగిన రెవెన్యూ స‌ద‌స్సుల్లో మొత్తం 3,111 పిటిషన్లు రాగా 3,015 అర్జీల ప‌రిష్కారం (96 శాతం) పూర్త‌యింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.

మంగ‌ళ‌వారం సీసీఎల్ఏ జి.జ‌య‌ల‌క్ష్మి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో రెవెన్యూ స‌ద‌స్సుల పిటిష‌న్ల ప‌రిష్కారం, పీజీఆర్ఎస్‌-రెవెన్యూ అర్జీల ప‌రిష్కార పురోగ‌తి త‌దిత‌ర అంశాల‌పై వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి క‌లెక్ట‌రేట్ నుంచి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. జిల్లాలో అర్జీల ప‌రిష్కారానికి తీసుకుంటున్న చ‌ర్య‌లు, పురోగ‌తిని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ అర్జీ అందుకున్న‌ప్పుడే క్షుణ్నంగా ప‌రిశీలించి.. సంబంధిత క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో నేరుగా లేదా వ‌ర్చువ‌ల్‌గా మాట్లాడి త‌గిన సూచ‌న‌లు ఇవ్వ‌డంతో పాటు వివిధ శాఖ‌ల అధికారుల ప‌టిష్ట స‌మ‌న్వ‌యం, స‌మ‌ర్థ‌వంత‌మైన ఆడిటింగ్ వంటి చ‌ర్య‌లు అర్జీల ప‌రిష్కారంలో జిల్లాను మెరుగైన స్థానంలో నిలుపుతున్న‌ట్లు వివ‌రించారు. నోడ‌ల్ అధికారులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అర్జీల ప‌రిష్కారంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తున్న‌ట్లు తెలిపారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్‌)కు సంబంధించి 105 అర్జీలు నమోదు కాగా ఇప్ప‌టికే 102 అర్జీల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు వెల్ల‌డించారు. అదేవిధంగా రీస‌ర్వేకు సంబంధించి 148 గ్రీవెన్స్‌కు గాను 137 అర్జీల ప‌రిష్కారం పూర్త‌యిన‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వ భూముల అసైన్‌మెంట్‌కు సంబంధించి 8 గ్రీవెన్సులు రిజిస్ట‌ర్ కాగా ఏడింటిని ప‌రిష్క‌రించామ‌న్నారు. ఇంటి స్థ‌లాల అసైన్‌మెంట్‌కు సంబంధించి 272 గ్రీవెన్సులు రిజిస్ట‌ర్ కాగా 269 అర్జీల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు వివ‌రించారు. 22ఏలో చేర్చ‌డం లేదా తొల‌గించ‌డానికి సంబంధించి 105 పిటిష‌న్లు రాగా 102 పిటిష‌న్ల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు తెలిపారు. మిగిలిన వాటి ప‌రిష్కారంలో ఉన్న అడ్డంకుల‌ను తొల‌గించి, వాటిని కూడా త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించేందుకు కృషిచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ వివ‌రించారు. 

స‌మావేశంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, గ్రామ,వార్డు స‌చివాల‌యాల ప్ర‌త్యేక అధికారి జి.జ్యోతి,  

క‌లెక్ట‌రేట్ ల్యాండ్ సెక్ష‌న్ సూప‌రింటెండెంట్ సీహెచ్ దుర్గాప్ర‌సాద్‌, కోఆర్డినేష‌న్ సెక్ష‌న్ సూప‌రింటెండెంట్ చంద్ర‌మౌళి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here