ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ. తేదీ. 05.02.2025
నగరంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
చలనాలు పెండింగ్ లో ఉన్న(90 రోజులు దాటిన) వాహనాలను సీజ్ చేసిన పోలీసులు
మార్చి ఒకటి నుండి నూతన మోటార్ వాహన చట్టం అమలు ( పెరిగిన ఫైన్లు)
విజయవాడ నగరములో ద్విచక్ర వాహన దారులు శిరస్త్రాణం ధరించకపోవటం పై ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం వారు గమనించుట మరియు రోడ్డు ప్రమాదములు పెరిగి మృతులు సంఖ్య పెరగటం పై ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు కొన్ని సూచనలు చేయుచూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా వాహనము నడుపునపుడు శిరస్త్రాణం పెట్టుకోవాలని, ఎవరైతే వాహనదారులు ఉల్లంఘనకు పాల్పడతారో అట్టి వాహన దారునికి అధికముగా జరిమానా విధించాలని , 90 రోజులు లోపల జరిమానా కట్టని వారి వాహనములు సీజ్ చేయాలని మరియు తరచూ మోటారు వాహన చట్టము ఉల్లంఘించిన వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేయుచూ రవాణా శాఖ వారికి ప్రతిపాదన పంపాలని ఆదేశించడమైనది.
గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి శ్రీ ఎస్. వి. రాజ శేఖర్ బాబు, ఐ.పి.యస్, ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమీషనర్ వారి సూచన మేరకు నగర ట్రాఫిక్ విభాగము మరియు శాంతి భద్రత విభాగముల వారు నగరములో మరియు జిల్లాలో సదరు సూచనలపై అవగాహన కల్పిస్తూ ది 19-12-2024 నుండి ప్రత్యెక డ్రైవ్ నిర్వహించి ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం ధరించుట వలన వారి విలువైన ప్రాణములు కాపాడుకోవాలని విన్నవించుచూ, అవగాహన కల్పిస్తూ జరిమానాలు విదించు చున్నారు. చాలామంది ద్విచక్ర వాహనదారులు గౌరవ హై కోర్టు సూచనలు గౌరవించి శిరస్త్రాణం ధరించి వాహనము నడుపుచున్నారు. కాని అత్యధిక వాహనదారులు పోలీసు వారు మోటారు వాహన చట్టం ఉల్లంఘనలపై విధించిన ఈ-చలానా జరిమానాలు కట్టకుండా ఉద్దేశ్యపూర్వకంగా కాలయాపన చేయుట మరియు కొంత అవగాహన లేకపోవడం వలన కూడా చాలా ఈ చలాన్లు పెండింగ్ వున్నాయి.
పోలీసు కమీషనర్ ఆదేశాల ప్రకారం ది 03-02-2025 మరియు 04-02-2025 వతేదీలలో 90 రోజుల పైన జరిమానా కట్టకుండా వున్న వాహనములను తనిఖీ చేసి 141 వాహనములను సీజ్ చేయడమైనది. వారు వారి వాహనముపై ఉన్న జరిమానాలు కట్టిన పిదప వారి వాహనములను విడుదల చేయుచున్నారు. కావున యన్.టి.ఆర్ జిల్లా మరియు విజయవాడ నగరంలోని వాహనదారులు వారి వాహనములపై వున్న 90 రోజులు దాటి వున్న ఈ చలాన్ లను వెంటనే ఈ పరివాహన యాప్ ద్వారా గాని, మీ సేవలో గాని వెంటనే జరిమానా కట్టి పెండింగ్ లో లేకుండా చూసుకోవలసిందిగా కోరడమైనది.
ది 01-03-2025 నుండి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం నూతన మోటారు వాహన చట్ట నిభంధనల ప్రకారం మోటారు వాహన చట్ట ఉల్లంఘనలపై పెంచిన జరిమానాలు విధించబడును. ఉదా: ప్రస్తుతం హేల్మ్ ట్ ఉల్లంఘన పై రూ.135/-లు వున్నా జరిమానా రూ.1,000/-లు విధించబడును. అంతేకాక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనము నడిపినచో కొత్త చట్ట ప్రకారం రూ 10,000/- విధించబడును . ఇతర ఉల్లంఘనలు కూడా కొత్త మోటారు వాహన చట్టములో జరిమానాలు పెంచబడినవి అని తెలియచేయుచూ , ఈ విషయము వాహన దారులు గమనించి నిబంధనలు పాటించవలసినదిగా తెలియచేయుచున్నాము. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు అమలుపరుచుటలో ది 1-03-2025 నుండి పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటారని తెలియ చేయడమైనది.