07-02-2025
అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించాలి:
మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ
ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి ఎన్నికల ప్రచార కర పత్రం ఆవిష్కరణ
ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాయలంలో వెస్ట్ ఎన్డీయే కూటమి నేతల సమావేశం
విజయవాడ : కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపే లక్ష్యంగా కూటమి నాయకులు పని చేయాలని వెస్ట్ నియోజవకర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పేర్కొన్నారు. గురునానక్ కాలనీలోని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్డీయే కూటమి నేతలందరూ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచార కర పత్రాలను ఆవిష్కరించారు.
అనంతరం మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యతా ఓటును ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు వేసేలా చూడాలని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 10,000 మంది గ్రాడ్యు యే ఓటర్లు ఉన్నారని, వారంతా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేసేలా చూడాలని కోరారు. వారి వివరాలు తెలుసుకుని ఉండాలన్నారు. దీని నిమిత్తం ప్రతి 30 మంది ఓట ర్లకు ఒక పరిశీలకుడిని నియమించాలని ఎన్డీయే కూటమి నేతలకు సూచించారు. ఎన్డీయే కుటుంబ సభ్యులంతా పోలింగ్ పూర్తయ్యే వరకు సమన్వయంతో పని
చేసి పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలిపించాలని కోరారు.
రాష్ట్రం అభివృద్ది వైపు నడవలాంటే, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే యువతకి మంచి భవిష్యత్తు వుండాలంటే కూటమి మరింత బలపడాల్సిన అవసరం వుందన్నారు. కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరి దగ్గరకి వెళ్లి అభ్యర్ధి ఆలపాటిని గెలిపించాలని విస్తృత ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాహ్, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎమ్.ఎస్.బేగ్, రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, టిడిపి కార్పొరేటర్ ఉమ్మడి చంటి, జనసేన కార్పొరేటర్లు పిళ్లా రాజేష్, పెద్దబాబు, జనసేన నాయకులు లింగం శివప్రసాద్, బొమ్మ గోవింద ప్రసాద్, బిజెపి జిల్లా కార్యదర్శి బొగవల్లి శ్రీధర్ బాబు, బిజెపి కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, బొల్లా విజయకుమార్, బిజెపి నాయకులు బొడ్డు నాగలక్ష్మీ, శివకుమార్ పట్నాయక్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.