Home Political news పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటికి భారీ మెజారిటీ సాధించాలి రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్దల సభకు...

పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటికి భారీ మెజారిటీ సాధించాలి రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్దల సభకు పంపించాలి

3
0

 విజయవాడ రూరల్

తేదీ: 08-02-2025

పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటికి భారీ మెజారిటీ సాధించాలి

రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్దల సభకు పంపించాలి

గన్నవరం నియోజకవర్గ టిడిపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షకులు కోటా వీరబాబు

ఏపీ అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించాలని గన్నవరం నియోజకవర్గ టిడిపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షకులు కోటా వీరబాబు పేర్కొన్నారు.

ఉమ్మడి కృష్ణ-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారి ఆదేశాల మేరకు విజయవాడ రూరల్ మండల పాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పోలింగ్ బూత్ ఇన్చార్జిలు మరియు ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షకులు మరియు నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు చైర్మన్ కోట వీరబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తిస్థాయి అభివృద్ధి జరగాలన్న, పూర్వ వైభవం రావాలన్న కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్రప్రసాద్ ఘనవిజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఏడు నెలల క్రితం ఎంత ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారో పట్టబద్దులు ఎన్నికల్లో కూడా అత్యధికలు ఓటింగ్ లో పాల్గొని ఆలపాటికి గన్నవరం నియోజకవర్గంలో మంచి మెజారిటీ సాధించి శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుకు మరింత బలాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర టిడిపి వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి గూడవల్లి నరసింహారావు (నరసయ్య), జనసేన పార్టీ విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు పొదిలి దుర్గారావు, కృష్ణాజిల్లా అంగన్వాడి మరియు డ్వాక్రా విభాగం అధ్యక్షురాలు పొదిలి లలిత, విజయవాడ రూరల్ మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు నెక్కంటి శ్రీదేవి తదితరులు ప్రసంగించి ఆలపాటి విజయానికి క్షేత్ర క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కోనేరు పెద్దబాబు, ప్రసాదంపాడు గ్రామ టిడిపి ప్రముఖులు బొప్పన హరికృష్ణ, రామవరప్పాడు గ్రామ టిడిపి ప్రముఖులు కొల్లా ఆనంద్, నిడమానూరు గ్రామ టిడిపి అధ్యక్షులు బండి వెంకటరావు, గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పరుచూరి నరేష్, పోలింగ్ బూత్ ఇన్చార్జులు దాసరి మహేష్, ఏ ఎస్ ఎస్ ఎన్ రాజు, గండికోట సీతయ్య, నూతి రామకృష్ణ, దాసరి గోకుల్ సాయి, సిహెచ్ సునీల్, దాసరి శ్వేత, జొన్నలగడ్డ మంగపతి, సొంగ సంతోష్, వసంత్ మరియు టిడిపి, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here