Home Political news ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం వైద్య ఆరోగ్య...

ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్

3
0

 ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం 

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్

కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన విజయవాడ లోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

టిడిపి పార్లమెంట్ ఇంచార్జ్ నెట్టెం రఘురాం, శాసనమండలి సభ్యులు పరచూరి అశోక్ బాబు, మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు రాజాబాబు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీనాథ్, జోనల్ ఇన్చార్జి శ్రీనివాసరాజు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సత్య కుమార్ మాట్లాడుతూ వివాదరహితుడుప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం కోసం బిజెపి నేతలు కార్యకర్తలు అందరం శ్రమించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నారు. 

ఐదేళ్ల వైసిపి పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోయిన ఏపీ ని గాడిలో పెట్టడానికి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. మోడీ మీద ఉన్న నమ్మకంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల పాలనాధక్షతతో ఓటు వేసిన రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన జరుగుతుందన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన భారీ విజయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అందించి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అఖండ విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. 

అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో 96 బూత్ లలో 78,350 గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయని వాళ్లందరిలో అవగాహన కల్పించి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అత్యధిక మెజారిటీ వచ్చే దిశగా సమన్వయంతో కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కార్పొరేటర్లు బుల్లా విజయ్, గుడివాడ నరేంద్ర రాఘవ, బిజెపి నాయకులు మువ్వల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here