*12-02-2025*
సీఎం చంద్రబాబును కలిసిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఉండవల్లి :అమరావతి రాజధానిలో ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), శాప్ చైర్మన్ రవినాయుడు తో కలిసి బుధవారం ఉండవల్లిలోని వారి నివాసంలో కలిశారు. ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) నేతృత్వంలో పాపుల్యస్ (Populous) గ్లోబల్ ఆర్కిటెక్స్ ప్రతినిధి సిద్ధార్థ్, ఎన్.వి.ఆర్కిటెక్స్ ప్రతినిధి వెంకట్ , ఐబిఎస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టేషన్స్ కంపెనీ ఎండి వడ్లమూడి హర్ష సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లను కలిశారు.