Home Political news పశ్చిమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి భారీ మెజార్టీ అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్...

పశ్చిమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి భారీ మెజార్టీ అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

3
0

 

12-02-2025

పశ్చిమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి భారీ మెజార్టీ అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజయవాడ : కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు ఖాయం. అయితే అత్య‌ధిక మెజార్టీ విజ‌య‌వాడ ప‌శ్చిమ‌నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే విధంగా కృషి చేయాల‌ని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ టిడిపి నాయ‌కులు, కార్య‌కర్త‌ల‌కు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ దిశా నిర్ధేశం చేశారు. 

గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధ‌వారం పశ్చిమ నియోజకవర్గ టిడిపి నేతలతో ఎంపి కేశినేని శివనాథ్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి వెస్ట్ నియోజకర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మారిటైమ్ బోర్డు చెర్మన్ దామచర్ల సత్యనారాయణ(సత్య) , రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా పదివేల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదు చేసినందుకు క్ల‌స్ట‌ర్,యూనిట్ ఇన్చార్జులు, బూత్ క‌న్వీరులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను అభినందించారు. ఓటు నమోదు చేయించటం ఎంతో ముఖ్యమో ఆ ఓటర్ పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేసే విధంగా కూడా చూడాలని సూచించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ఆలాపాటి రాజేంద్రప్రసాద్ భారీ మెజార్టీ తో సాధించిన గెలుపు ఒక బహుమతి అందించాలన్నారు. అలాగే ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి త్వ‌ర‌గా ఓట‌ర్ వేరిఫికేష‌న్, ఐడెంటిఫికేష‌న్ సేక‌రణ పూర్తి చేసి ప్ర‌చారంపై దృష్టి సారించాల‌న్నారు.  

అంత‌కు ముందు రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నిక‌లే అని తెలిగ్గా తీసుకోవ‌ద్ద‌న్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల కంటే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు విభిన్నంగా వుంటాయ‌ని, గ్రాడ్యుయేట్స్ కి మొద‌టి ప్రాధాన్య‌త ఓటు ఏ విధంగా వేయాల‌నే అంశం పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. 

ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లాహ్‌, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎమ్.ఎస్.బేగ్ , రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, కార్పొరేటర్ ఉమ్మడి చంటి, కార్పొరేట‌ర్ హ‌ర్ష‌ద్, కార్పొరేట‌ర్ మైల‌వ‌ర‌పు కృష్ణ‌, క్ల‌స్ట‌ర్ ఇన్చార్జ్ సుకాసి కిర‌ణ్‌, సుబ్బారెడ్డి, యెదుపాటి రామ‌య్య‌, క‌రీముల్లా, గంగాధ‌ర్, బ‌డుగు గ‌ణేష్‌, భ‌వానీ ప్ర‌సాద్ ల‌తో పాటు ప‌శ్చిమ నియోజ‌క‌వర్గ టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here