*12-02-2025*
జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ : జేఈఈ మెయిన్స్ ఫేజ్-1లో 99.8% పర్సంటైల్ అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విజయవాడకి చెందిన అన్ అకాడమి విద్యార్థులను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం అన్ అకాడమి సెంటర్ అకడమిక్ హెడ్ నమ్మి నాగేంద్ర ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్స్ అత్యధిక మార్కులతో సత్తా చాటిన విద్యార్ధులు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను కలిశారు. విద్యార్ధులను ఎంపి కేశినేని శివనాథ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కాజా రామ కృష్ణ పాల్గొన్నారు