Home Political news ఎన్డీయే ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ గెలుపు కోసం ప్ర‌చారం

ఎన్డీయే ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ గెలుపు కోసం ప్ర‌చారం

4
0

ఎన్డీయే ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్  గెలుపు కోసం ప్ర‌చారం

  పాఠ‌శాల‌ల్లో ప్ర‌చార క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేసిన నాగుల్ మీరా, ఫ‌తావుల్లాహ్, ఎమ్.ఎస్.బేగ్ 

విజ‌య‌వాడ : ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్డీయే కూట‌మి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి  ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్  తొలి ప్రాధాన్యతా ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్డీయే కూట‌మి నాయ‌కులు.శుక్ర‌వారం 54, 53 డివిజన్ల లోని  మౌలానా అబుల్ కలాం ఆజాద్ హై స్కూల్, మహమ్మద్ అలీ పురం పాఠశాల తో పాటు మ‌రో ఉర్ధూ పాఠ‌శాల‌లో  ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. 

ఈ నెల 27వ తేదీ జరగబోయే ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎలక్షన్లో ఎన్టీయే కూటమి అభ్యర్థి  ఆలపాటి రాజేంద్రప్రసాద్  విజయాన్ని కాంక్షిస్తూ టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌హ‌మ్మ‌ద్ ఫ‌తావుల్లా, రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి ఎమ్.ఎస్.బేగ్, టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు  కోగంటి రామారావు ఉపాద్యాయుల‌కు ఎన్నిక‌ల క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేసి మొద‌ట ప్రాధాన్యత ఓటుగా 1 అంకె వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

ఈ కార్య‌క్ర‌మంలో 53వ డివిజన్ కార్పొరేటర్ అప్పాజీ, జ‌న‌సేన కార్పొరేట‌ర్ పెద్ద‌బాబు, 54వ డివిజన్ అధ్యక్షుడు షేక్ స‌లీం, 55వ డివిజ‌న్ అధ్య‌క్షుడు మొహమ్మ‌ద్ జాహిద్, టిడిపి రాష్ట్ర మ‌హిళా ఉపాధ్య‌క్షురాలు షేక్ ఆషా,ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు షేక్ నాగూర్,   గుర్రం కొండ , సుఖాసీ సరిత, పల్లిపొగు ప్రసాద్,తాజ్జుద్దీన్, బిజెపి నాయ‌కులు దాడి అప్పారావు ల‌తో పాటు  ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here