Home Political news ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌కు ప‌టిష్ట ఏర్పాట్లు..

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌కు ప‌టిష్ట ఏర్పాట్లు..

3
0

 ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌కు ప‌టిష్ట ఏర్పాట్లు..

– *224 మంది ప్రిసైడింగ్‌, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు*

– *సిబ్బందికి రెండు ద‌శ‌ల్లో పూర్తిస్థాయిలో శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు*

– *112 పోలింగ్ స్టేష‌న్ల‌కు మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల నియామ‌కం*

– *ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

ఈ నెల 27న జ‌రిగే  కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎన్‌టీఆర్ జిల్లాస్థాయిలో ప‌టిష్ట ఏర్పాట్లు చేశామని.. ఇప్ప‌టికే 224 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల (ఏపీవో)కు రెండుద‌శ‌ల్లో పూర్తిస్థాయిలో శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.

ఎన్నిక‌ల జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్ వి.క‌రుణ‌.. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని జిల్లాల క‌లెక్ట‌ర్లు, స‌హాయ రిట‌ర్నింగ్ అధికారుల‌తో శ‌నివారం వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ జిల్లాలోని ఏర్పాట్ల‌ను వివ‌రించారు. 112 పోలింగ్ స్టేష‌న్ల‌కు 112 మంది పీవోలు, 112 మంది ఏపీవోల‌ను నియ‌మించామ‌ని… ఒక్కో పోలింగ్ స్టేష‌న్‌కు ఇద్ద‌రు చొప్పున ఇత‌ర ప్రిసైడింగ్ అధికారుల (ఓపీవో)ను నియ‌మించిన‌ట్లు తెలిపారు. మూడు కేట‌గిరీల‌కు సంబంధించి రిజ‌ర్వ్ కేట‌గిరీలో 90 మంది సిద్ధంగా ఉన్న‌ట్లు వివ‌రించారు. ఒక్కో పోలింగ్ స్టేష‌న్‌కు ఒక‌రు చొప్పున మొత్తం 112 మంది మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల‌ను నియ‌మించామ‌ని.. 19 మందిని రిజ‌ర్వ్‌లో ఉంచిన‌ట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి విజ‌య‌వాడ‌, నందిగామ‌, తిరువూరు డివిజ‌న్ల‌లో డిస్ట్రిబ్యూష‌న్‌, రిసెప్ష‌న్‌, తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌ల‌ను గుర్తించిన‌ట్లు తెలిపారు. మొత్తం 224 బ్యాలెట్ బాక్సులు అవ‌స‌రం కాగా రిజ‌ర్వ్‌తో క‌లిపి 324 బాక్సులు అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్వ‌హించేందుకు 454 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో 24 ఫ్ల‌యింగ్ స్క్వాడ్ టీమ్స్ (ఎఫ్ఎస్‌టీ) విధులు నిర్వ‌ర్తిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 11 చెక్‌పోస్టుల వ‌ద్ద రెండు షిఫ్ట్‌ల్లో 22 స్టాటిక్ స‌ర్వైలెన్స్ టీమ్స్ (ఎస్ఎస్‌టీ) విధుల్లో ఉన్నాయ‌ని, ఏడు వీడియో స‌ర్వైలెన్స్ టీమ్స్ (వీఎస్‌టీ) కూడా ప‌నిచేస్తున్నాయ‌న్నారు. అన్ని పోలింగ్ స్టేష‌న్ల‌లోనూ వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. రూట్ ఆఫీస‌ర్లు, సెక్టార్ ఆఫీస‌ర్లు, సెక్టార్ పోలీస్ ఆఫీర్ల‌ను కూడా అవ‌స‌రం మేర‌కు నియ‌మించామ‌ని, నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌న బృందం అప్ర‌మ‌త్త‌త‌తో ప‌నిచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో డీఆర్‌వో, స‌హాయ రిట‌ర్నింగ్ అధికారి ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here