శనివారం ఉదయం 10:00″గం లకు” 27వ డివిజన్ పరిధిలోని దుర్గాపురం BRTS రోడ్డు దగ్గర ఉన్న టి వెంకటేశ్వరరావు మున్సిపల్ స్కూల్ లో ఉన్నటువంటి టీచర్స్ ను
, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు కూటమి బలపరిచిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో ఒకటో నెంబర్ గుర్తుపై పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఈనెల 27వ తేదీన జరిగే ఓటింగ్లో మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి గెలిపించాలని టీచర్స్ అందర్నీ ఓట్లు అభ్యర్థించడం జరిగినది.
వారందరూ తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధికి మా సంక్షేమానికి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం గత ఏడు మాసాల నుండి పనిచేస్తుందని దీనిపై మాకు పూర్తి నమ్మకం ఏర్పడినదని కచ్చితంగా మీరు కోరినటువంటి విధముగా మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజా కి ఓటు వేస్తామని హామీ ఇచ్చారు
ఈ సందర్భంగా మీడియా వారితో బోండా ఉమా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజా కి పూర్తిస్థాయిలో రాజకీయ అనుభవం ఉండటమే కాకుండా గ్రాడ్జెట్స్ కు ఉన్న సమస్య పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, ఇప్పటికే మూడుసార్లు శాసనసభ్యులుగా ఒకసారి మంత్రిగా పనిచేసే ఏ రకంగా సమస్యలను వెలుగెత్తి మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాలో పూర్తిస్థాయిలో ఉన్నటువంటి దిట్ట అని నిరుద్యోగులందరికీ గ్రాడ్యుయేట్స్ చేసి నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా వారికి ఉపాధి దొరికేంతవరకు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి త్వరలోనే ఇస్తామని నారా చంద్రబాబునాయుడు గారు ప్రకటించినటువంటి, పవన్ కళ్యాణ్ నటించినటువంటి విధముగా వెంటనే ఏర్పాటు చేస్తామని
ఈ నవ్యాంధ్రప్రదేశ్ ను పారిశ్రామిక రాష్ట్రంగా అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యను రూపుమాపుతామని, టీచర్స్ కు ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు టెన్షన్ గా ఒకటో తారీకు జీతాలు ఇస్తామని జీతభత్యాలు ఇస్తామని అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంతో పాటు నవ్యాంధ్రప్రదేశ్లో నిర్మాణ దశలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ఎన్నికలలో హామీ ఇచ్చినటువంటి విధముగా అర్హులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందింప చేస్తామని దీనికి వారిదిగా రేపు మీ ఓట్లతో గెలుపొంది గెలుపొందేటువంటి అభ్యర్థి అయినా ఆలపాటి రాజా కి గెలిపించి శాసనమండలిలోకి పంపించవలసినదిగా కోరారు..
ఈ కార్యక్రమంలో:-కడప RTC రీజనల్ ఛైర్మెన్ అబ్జర్వర్ పూల నాగరాజు, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ డివిజన్ పార్టీ ఇంచార్జ్ నవనీతం సాంబశివరావు, అధ్యక్షులు కొండపల్లి రూప్ కుమార్, దాసరి నాగరాజు, మద్దాల రుక్మిణి, మంటాడ శివ, బండారు కొండ, దేశ వెంకటరావు, కొండపావులూరి బాబు, గుడివాడ దీపక్, హనుమంతరావు, డి మార్ట్ రమణమ్మ, ఆటో యూనియన్ సురేష్, పసుపులేటి పిచ్చయ్య, విజయలక్ష్మి, లతోపాటు వందలాదిమంది టీడీపీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…