తేది: 22.02.2025.
విద్యార్థులు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నాలి – నాగశేషమ్మ
*ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు- రాజుబాబు*
ఆహారంను సరిగా తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, ధూమపానం, మద్యపానం సేవించడం, ఒత్తిడికి గురవ్వడం వలన నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు సంక్రమిస్తున్నాయని, వీటిపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ద్వారా ఇంటింటా ప్రచార కార్య కార్యక్రమాన్ని చేపట్టామని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగశేషమ్మ అన్నారు.
స్థానిక రాజీవ్ నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో శనివారంనాడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగశేషమ్మ, వైద్య అధికారి డాక్టర్ వంశీలాల్ రాథోడ్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయిస్ జోనల్ ప్రెసిడెంట్ యం. రాజుబాబు (ఆర్టిఓ విభాగం), జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ కె. రమేష్ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగశేషమ్మ మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సేవలను అందించాలన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ అన్నట్లుగా మానవ సేవయే మాధవ సేవ అనే భావంతో దేశం పట్ల నిబద్ధత నిజాయితీ అంకితభావంను కలిగి విద్యార్థులు సమాజం యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలన్నారు. ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ప్రోగ్రామ్ ఈనెల 22 నుండి 28 వరకు వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులను తెలియజేసారు. ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ వంశీలాల్ రాథోడ్ మాట్లాడుతూ విపత్తు సంభవించినప్పుడు ప్రజలను తరలించడం, ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడం, ఆహారంను ఆశ్రయంను వైద్య సంరక్షణను అందించడం వంటి చర్యలలో
సహాయపడటమే లక్ష్యంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయిస్ జోనల్ అధ్యక్షులు యం. రాజుబాబు (ఆర్టిఓ విభాగం) మాట్లాడుతూ విపత్తుకర పరిస్థితులలో ప్రజలకు సహయ కార్యక్రమాలు చేపట్టడంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల కీలక పాత్ర వహించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు చురుకైన పాత్ర పోషిస్తున్నందుకు విద్యార్థులను ఆయన అభినందించారు. రవాణాశాఖ చేపట్టిన రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమాల్లో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చురుకుగా పాల్గొని ప్రజలలో రోడ్డు భద్రతపై అవగాహన
కల్పించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగేటప్పుడు హెల్మెట్ లేకపోవడం వలన తలకు దెబ్బ తగిలి ఎక్కువ మంది మరణిస్తున్నారని ఆయన చెప్పారు. మీకుటుంబ సభ్యులు బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ మీద వెళ్ళనివ్వాలని లేకపోతే బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తులు మరణిస్తే ఆకుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిని ఆయన వివరించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో ర్యాలీగా వెళుతూ నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల గురించి ప్రజలకు తెలియజెయ్యడం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంటింటా ప్రచారం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ కె. రమేష్, దంత వైద్య అధికారి డాక్టర్ భాస్కర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కడియం శ్రీదేవి, సహాయ అధికారిని యండి హసీనా మరియు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.