Home Crime News పోగొట్టుకున్న దొంగిలించ బడిన మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరి చేసి బాధితులకు అందించిన...

పోగొట్టుకున్న దొంగిలించ బడిన మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరి చేసి బాధితులకు అందించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

5
0

 ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.తేదీ.23.02.2025

 పోగొట్టుకున్న దొంగిలించ బడిన మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరి చేసి బాధితులకు అందించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

సుమారు 60 లక్షల విలువైన 372 మొబైల్ ఫోన్ల రికవరీ 

రికవరీ ఫోన్లను బాధితులకు అందించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్ లో భాగంగా రికవరి చేసిన 372 మొబైల్ ఫోన్లను ఈ రోజు కమాండ్ కంట్రోల్ నందు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఫిర్యాదు దారులకు అందజేయడం జరిగింది. ఈ నాల్గవ విడత రికవరీ ఫోన్ల విలువ సుమారుగా రూ. 60 లక్షలు ఉండవచ్చు. 

ప్రజల వద్ద నుండి దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా రికవరీ చేయడం జరుగుతోంది. ఫిర్యాదు దారులు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పోలీసులు IMEI నెంబర్లు, బిల్లు మరియు అడ్రస్ ప్రూఫ్ లను CEIR పోర్టల్ లో నమోదు చేస్తారు. దీని తర్వాత, ఫిర్యాదుదారులకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ నెంబర్ వస్తుంది. TSP (Telecom Service Provider) వారు ఈ IMEI నెంబర్లను బ్లాక్ చేసి, ప్రస్తుతం ఆ ఫోన్ ను ఎవరు వాడుతున్నారో వారి వివరాలను పోలీసులకు అందిస్తారు. ఇలా రికవరీ అయిన మొబైల్ ఫోన్లను తిరిగి IMEI నెంబర్‌ను అన్‌బ్లాక్ చేసి ఫిర్యాదు దారులకు అందజేస్తారు. 

ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ….

సాంకేతికత ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేశాం, గతంలొ‌కూడా ఇదే విధంగా భారీగా ఫోన్లను స్వాధినం చేసుకున్నాం, ఫోన్ పోయిన వెంటనే పోలీసు లకు సమాచారం ఇస్తే గుర్తించే అవకాశం ఉంటుంది,

 మేము ఏ ఫోన్ ఎక్కడ ఉందో సాంకేతిక పరిజ్ఞానం తో గుర్తించాం,

నేడు ఫోన్ లోనే ప్రతి మనిషి జీవితం ఉంటుంది,

బ్యాంకు లావాదేవీలు, ప్రభుత్వం గుర్తింపు‌ కార్డులు ఫోన్ తోనే ముడిపడి ఉన్నాయి,

మరికొన్ని ఫోన్లను గుర్తించాల్సి ఉంది.. త్వరలో వాటిని కూడా స్వాదీనం చేసుకోవడం జరుగుతుంది.

ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ బాగా ఎక్కువ అయ్యాయి, ప్రజలు ఆశ తో వెళ్లి మీరు ఇరుక్కూ పోవద్దు, మీరు తొలుత వేసే పది రూపాయల కు ముప్పై తిరిగి వేసి నమ్మకం కలిగిస్తారు, ఆ తరువాత వేలు, లక్షల్లో మీ ఎకౌంటు ద్వారా దోచేస్తారు, మొదట వేసిన ముప్పై వేరొకరి డబ్బులు దాని వలన మీరు కూడా ముద్దాయిలు అవుతారు, ప్రజలు ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, రోడ్ సేప్టీ , సైబర్ సేఫ్టీ పట్ల అవగాహన పెంచుకోవాలి,

ప్రతి ఒక్కరూ సేప్టీ కల్చర్ ను అలవరచుకోవాలి, సురక్ష కమిటీ లు బాగా పని చేస్తున్నాయి, కృష్ణలంక సిఐ నాగరాజు ఆధ్వర్యంలో కెమెరాలు పెట్టి, సురక్ష కమిటీ ల ద్వారా కేసులు చేధించారు, విజయవాడ వ్యాప్తంగా 1260 కెమెరాలు పెట్టాం, మార్చిలో ఒక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం,

అపార్ట్మెంట్ ల వద్ద లోపల, బయట సిసి కెమెరా లు ఉండాలి, బైక్ దొంగిలిస్తే వెంటనే తెలిసేలా సాంకేతికత ను అందుబాటులో కి తెస్తున్నాం, ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించి‌ వాహనాలు నడపండి, మీ కుటుంబాలకు మీరే ఆసరా, అండ, దండ అని గుర్తుంచుకోండి. ఈ సందర్బంగా సైబర్ క్రైమ్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు. సదరు మొబైల్ ఫోన్లను తమిళనాడు, తెలంగాణ, కేరళ మరియు ఇతర రాష్ట్రాల నుంచి రికవరీ చేయడం జరిగింది.

ఫిర్యాదుదారుల అందరి IMEI లను సర్వీస్ ప్రోవైడర్లకు పంపించడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అద్భుతమైన టెక్నాలజీ తయారు చేశారు. CEIR ద్వారా ఫోన్లను రికవరి చేయడం జరిగింది.

ఇప్పటికే సైబర్ నేరాలపై తీయనుకోవాల్సిన జాగ్రత్తలపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, నగరంలో సైబర్ నేరాలు జరుగకుండా నిరోధించడం జరుగుతుంది. 1930 ఉపయోగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. అందరూ వారి సేవలను వినియోగించు కోవాలి. . ఎవరైనా సైబర్ నేరాల బారిన పడిన వెంటనే మీరు 1930కి కాల్ చేస్తే ఆయా అకౌంట్ లను ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో మొబైల్ మన జీవితంలో చాలా ముఖ్యం అయ్యింది. కావున ఈ మొబైల్ రికవరీ మీకు స్వాంతన కలిగిస్తుందని తెలియజేసారు.

ఇప్పటి వరకు మూడు విడతలలో ఎన్.టి.ఆర్.జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 2,205 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, ప్రజలకు తిరిగి అందజేయడం జరిగిందని తెలియజేసినారు.

కాబట్టి, ప్రజలు CEIR పోర్టల్ సేవలను వినియోగించుకొని, తమ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి పొందాలని పోలీస్ శాఖ సూచించింది.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ తోపాటు డి.సి.పి.లు గౌతమీ షాలి ఐ.పి.ఎస్. కే.తిరుమలేశ్వర్ రెడ్డి ఐ.పి.ఎస్. కె.జి.వి. సరిత ఐ. పి. ఎస్. ఎ. బి. టి. ఎస్. ఉదయారాణి ఐ. పి. ఎస్. ఎం కృష్ణ మూర్తి నాయుడు ఎస్. వి. డి. ప్రసాద్ ఏ.డి.సి.పి. జి.రామ కృష్ణ సైబర్ క్రైమ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here