Home Political news ప్రయాగ్ రాజ్ లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన

ప్రయాగ్ రాజ్ లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన

3
0

 Dt…25-02-2025.

ప్రయాగ్ రాజ్ లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన

*మహా కుంభమేళా ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి,మున్సిపల్ శాఖ అధికారులు*

*బోటులో త్రివేణీ సంగమం వరకూ ప్రయాణించి ఘాట్ల వద్ద ఏర్పాట్లు,నదిలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ*

*స్నాన ఘాట్ ల వద్ద ఏర్పాట్లు,పారిశుధ్య సమస్య లేకుండా తీసుకున్న జాగ్రత్తలు,చెత్త నిర్వహణ తో పాటు ఇతర ఏర్పాట్ల ను పరిశీలించిన మంత్రి*

*జూలై 2027 లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం కుంభమేళా ఏర్పాట్లను అధ్యయనం చేస్తున్న మంత్రి నారాయణ,అధికారులు*

అమరావతి…

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగింది…2027 జులై లో ఏపీలో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మహా కుంభమేళా ఏర్పాట్లను అధ్యయనం చేసేందుకు మంత్రి నారాయణ,మున్సిపల్ శాఖ అధికారులు ప్రయాగ్ రాజ్ లో పర్యటించారు..మొదటి రోజు కుంభమేళా ఆఫీసర్ విజయ్ కిరణ్ ఆనంద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఏర్పాట్లను మంత్రి బృందానికి వివరించారు…రెండో రోజు మంగళవారం ఉదయం కుంభమేళా జరుగుతున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు…కుంభమేళా సెక్టార్ 2 నుంచి బోట్లలో త్రివేణీ సంగమం వరకూ ప్రయాణించి భక్తులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు…స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లు,తాగునీటి సరఫరా,మరుగుదొడ్లు,పారిశుధ్యం సమస్య లేకుండా తీసుకుంటున్న చర్యలను అక్కడి అధికారులు మంత్రి బృందానికి వివరించారు…కోట్లాది మంది భక్తులు నదిలో వేస్తున్న పూజా సామాగ్రి,ఇతర చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను కూడా వివరించారు.

అక్కడి నుంచి మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి మంత్రి,అధికారులు చేరుకున్నారు.మహా కుంభమేళా కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన మరో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా మంత్రి బృందం సందర్శించింది..అలహాబాద్, ప్రయాగ్ రాజ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వచ్చే సాలిడ్ వేస్ట్,లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేస్తున్నారనేది మున్సిపల్ కమిషనర్ చంద్రమోహన్ గార్గ్  వివరించారు…కోట్లాది మంది భక్తులు మహా కుంభమేళాకు తరలి వస్తున్నప్పటికీ ఎక్కడా పారిశుధ్య సమస్యలు తలెత్తడం లేదని తెలిపారు..కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.రెండు రోజుల పర్యటన ముగించుకుని మంత్రి,అధికారులు  బయలుదేరి రాత్రికి విజయవాడ చేరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here