*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*
*తేదీ.25-02-2025.*
మహా శివ రాత్రి మహోత్సవాల సందర్భంగా కమీషనరేట్ నందు క్షేత్రస్థాయిలో చేసిన బందోబస్త్ ఏర్పాట్లును పర్యవేక్షించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్
ది.26.02.2025 తేదిన మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలో పుణ్య స్నానాలు చేయు ప్రదేశాల అయిన దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, భవానిఘాట్, పవిత్ర సంగమం మొదలైన ఘాట్లను, క్యూ లైన్లు మరియు శివాలయాల వద్ద భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా శాంతి భద్రతలు మరియు ట్రాఫిక్ పరంగా క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సిబ్బంది అప్రమత్తంగా బందోబస్త్ విధులు నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు సలహాలను చేసినారు.
అదే విధంగా నగరానికి అతి దగ్గరలో ఉన్న యనమలకుదురు శివాలయం కు వెళ్ళు రహధారులలో మరియు పరిసర ప్రాంతాలలో శాంతి భద్రతలు మరియు ట్రాఫిక్ పరంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్త్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కృష్ణా జిల్లా ఎస్.పి. ఆర్.గంగాధర్ రావు ఐ.పి.ఎస్. తోపాటు యనమలకుదురు శివాలయం టెంపుల్ కు వెళ్ళి ధర్శన అనంతరం శివాలయం మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ క్రమంలో టెంపల్ పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సి.సి.కెమెరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా ఎక్కడా ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ నందు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని స్నాన ఘాట్లలో ఎన్.డి.ఆర్.ఎఫ్./ఎస్.డి.ఆర్.ఎఫ్.సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడా ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ఉండెందుకు సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో బందోబస్త్ ఏర్పాట్లను చేయడం జరిగిందని, అందరూ ఆనందోత్సాహాల మధ్య మహా శివరాత్రి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ కృష్ణా జిల్లా ఎస్.పి. ఆర్.గంగాధర్ రావు ఐ.పి.ఎస్. డి.సి.పి. లు గౌతమి షాలి ఐ.పి.ఎస్. కృష్ణ మూర్తి నాయుడు ఏ.డి.సి.పి ఏ.వి.ఎల్.ప్రసన్న కుమార్ ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.