*ఉమ్మడి చంటి సేవా కార్యక్రమం*
మహాశివరాత్రి పండుగ రోజున స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో ఘనమైన విషయమని, దానితోపాటు నిరాశ్రయులను బాధితులను ఆదుకోవడం కూడా దైవ కార్యంగానే భావించాలని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి స్పష్టం చేశారు.
మానవులకు సేవ చేయడం మాధవునికి సేవ చేయడమే అవుతుందని పేర్కొన్నారు.
నిరాశ్రయులను బాధల్లో ఉన్నవారిని ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి పనిచేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహాశివరాత్రి పర్వదినం రోజున కూడా రమణయ్య కూల్ డ్రింక్ షాప్ ప్రాంతంలో వైజాగ్ కు చెందిన శివయ్య అనే అనారోగ్యంతో బాధపడుతున్న, నిరాశ్రయుని గుర్తించి అతనిని ప్రభుత్వ వైద్యశాలకు పంపించి వైద్య సేవలను అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో ఉన్న అతనిని వైద్యం చేయించి, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నిర్మల హృదయ భవన్ కు అప్పగిస్తామని ఉమ్మడి చంటి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా చేయడం ఎంతో పుణ్యప్రదం అన్నారు. మహాశివరాత్రి రోజున స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా ఎంత పుణ్యం వస్తుందో, నిరాశ్రయులను, బాధలలో ఉన్న వారిని ఆదుకోవడం ద్వారా అంతే పుణ్యం వస్తుంది అన్నారు.