కన్నులపండువగా మహా శివరాత్రి వేడుకలు
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు
ఫిబ్రవరి 26 గన్నవరం నియోజకవర్గంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. పలు ఆలయాలలో పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలోని భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగిన మహా శివరాత్రి ఉత్సవాలలో గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భజన కార్యక్రమాలను ఎమ్మెల్యే ఆసక్తిగా తిలకించారు. ఆలయ ప్రాంగణం శివ నామ స్మరణతో నినాదాలతో మార్మోగింది
అనంతరం కృష్ణాజిల్లా లో ప్రసిద్ధిగాంచిన యనమలకుదురు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యే కు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రభలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశివరాత్రి పండుగ వేళ భోళాశంకరుడు అశీస్సులు తెలుగు ప్రజలందరి పై ఉండి సుఖసంతోషాలు జీవించాలన్నారు. ముక్కంటి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని యార్లగడ్డ ఆకాంక్షించారు.