26-2-2025
రాష్ట్ర ప్రజలపై నియోజకవర్గ ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి – MLA బొండా ఉమ
ధి:26-2-2025 బుధవారం ఉదయం 8:30″గం లకు ” చల్లపల్లి బంగ్లా దగ్గర ఉన్న శివాలయంలో నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సకుటుంబ సమేతంగా పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్ర ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలలో మరియు అన్నదాన కార్యక్రమాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఆ పరమేశ్వరుని అనుగ్రహం సెంట్రల్ నియోజకవర్గం పై ఎల్లవేళలా ఉండాలని కోరుకోవడం జరిగింది