విజయవాడ నగరపాలక సంస్థ
27-02-2025
అగ్ని ప్రమాద నిరోధక చర్యలు కచ్చితంగా ఉండాలి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు కచ్చితంగా ఉండాలన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం 58వ డివిజన్, అజిత్ సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ లోగల కార్తికేయ హాస్పిటల్ ను సందర్శించి అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగర పాలక సంస్థ వారి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలంటే కచ్చితంగా అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పాటించాలని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఎస్టింగ్విషర్ ద్వారా అగ్ని ను ఎలా ఆర్పుతారు, ప్రజల భయభ్రాంతులకు గురవకుండా వారిని అగ్ని నుండి ఎలా కాపాడుతారు వంటి అంశాలపై అక్కడున్న సిబ్బందితో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు, హాస్పిటల్ మొత్తంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి అక్కడ ఉన్నాయని ప్రజలకు తెలిసేటట్టు దారిలో రేడియం స్టిక్కర్లు అమర్చాలని, హాస్పిటల్ మొత్తంలో సెట్ బ్యాక్ లు సరిగా ఉన్నాయా లేదా అని, స్వయంగా తానే హాస్పిటల్ మొత్తం తిరిగి పరిశీలించారు.
ఈ పర్యటనలో ఇంచార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెంటింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్య కుమారి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.