కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం,
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ.
తేది. 28.02.2025.
మహా శివరాత్రి ఉత్సవముల సందర్బంగా
ఈరోజు అనగా తేది.28.02.2023, శుక్రవారము – ఇంద్ర కీలాద్రి శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం లో-ఉ. గం.08-00ల నుండి మండపారాధన,కలశారాధన, మూల మంత్ర
హవనములు, హారతి, మంత్ర పుష్పం, తీర్ధ ప్రసాద వినియోగం వైభవం గా జరిగింది.అనంతరం ఉదయం గం.09-00 నుండి మహా శివరాత్రి ఉత్సవ *పూర్ణాహుతి*, ధాన్యకోట్నోత్సవం,
వసంతోత్సవము నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమం లో ఆలయ కార్యనిర్వహణాధికారి కె. రామచంద్ర మోహన్, స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అనంతరం శివాలయం నుండి దేవతామూర్తులతో దుర్గా ఘాట్ చేరి, పవిత్ర కృష్ణానదిలో అవభృతోత్సవ కార్యక్రమం నిర్వహించడమైనది.
తేదీ. 01.03.2025 నుండి 03.03.2025 వరకు రాత్రి 7గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవలు జరుగును.