Home public news సామాజిక సేవ దృక్పథంతో కార్పోరేట్ చికిత్స అందించడమే శ్రీ భవాని హస్పిటల్ లక్ష్యం

సామాజిక సేవ దృక్పథంతో కార్పోరేట్ చికిత్స అందించడమే శ్రీ భవాని హస్పిటల్ లక్ష్యం

3
0

 


సామాజిక సేవ దృక్పథంతో కార్పోరేట్ చికిత్స అందించడమే శ్రీ భవాని హస్పిటల్ లక్ష్యం

డాక్టర్ వెనిగళ్ళ చంద్రశేఖర్ శ్రీభవాని మల్టీ స్పెషాలిటి ఎండి

విజయవాడ,:సామాన్యుడికి వైద్య సేవలు దూరమౌతున్నాయని ఆ అంతరాన్ని తగ్గించి సామాన్యూడికి సైతం కార్పొరేట్ వైద్య సేవలు అందలన్న సంకల్పంతో శ్రీభవాని మల్టీ స్పెషాలిటి ని ప్రారంభించామని ఎండి డాక్టర్ వెనిగళ్ళ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం భవాని పురంలోని శ్రీ భవాని మల్టీ స్పెషాలిటి హస్పటల్ లో జర్నలిస్ట్ లకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల కుటుంబాలకు కిడ్ని,లంగ్స్ ,షుగర్ ,ఎముకల దృడత్వ ప‌రిక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భవాని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ వెనిగళ్ళ చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ లో తక్కువ ఖర్చుతో అత్యాధునిక చికిత్సను సామాజిక సేవా దృక్పథంతో అందిస్తున్నామని తెలిపారు.365 రోజులు 24 గంటలు అన్నారు అత్యవసర సేవలు అన్నారు.లభిస్తాయని అన్నారు. ఈఎన్ టి సర్జరి నిపుణులు,వెన్నుముక సర్జరీ నిపుణులు సుబ్బయ్య అన్నీ రకాల సర్జరీ నిపుణులు , గైనకాలజీ,యూరాలజీ,పల్మనాలజీ,జనరల్ మెడిసిన్,కార్డియాలజి,నెఫ్రాలజి ,ఇఎన్టీ వంటి అన్ని విభాగాల్లో అత్యాధునిక చికిత్సతో అనుభజ్ఞలైన డాక్టర్ల బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. జర్నలిస్టు మిత్రులకు హెల్త్ డిస్కౌంట్ కార్డులను అంద చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు త్వరలో ప్రారంభిస్తామని, అన్ని రకాల థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లు,సిజిహెచ్ ఎస్ , ఎంప్లాయి హెల్త్ కార్డు లపై వైద్య సేవలు లభిస్తుందన్నారు అనంతరం శ్రీ భవాని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ పేదవాడికి సైతం కార్పొరేట్ వైద్య సేవలు అందాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయక సామాజిక సేవ చేస్తున్న జర్నలిస్టులకు వైద్య సేవలు అందించడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డు ల ద్వారా లేదా డిస్కౌంట్ లో వైద్య సేవలు అంద చేస్తామని తెలిపారు.ఈరోజు సుమారు ఆరవై నుండీ డెబ్బై మంది వరకు ఉచిత వైద్య పరిక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here