Home Crime News హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన జగ్గయ్యపేట పోలీసులు

హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన జగ్గయ్యపేట పోలీసులు

3
0

 హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన జగ్గయ్యపేట పోలీసులు

జగ్గయ్యపేట 

జగ్గయ్యపేట పట్టణం పోలీసు సర్కిల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరిగింది.ది 27.02.2025 తేదీన శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో జగ్గయ్యపేట చెరువు బజార్ సమీపంలో రాత్రి సమయంలో జరిగిన గొడవ నేపథ్యంలో జరిగిన హత్య కేసులో నిందితులను జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు వారి సిబ్బందితో కలిసి జగ్గయ్యపేట పద్మావతి నగర్ చెక్పోస్ట్ వద్ద ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించి అరెస్టు చేయడం జరిగింది.మరో జవైనల్ ను అదుపులోనికి తీసుకుని జవైనల్ హోర్ కు తరలించడం జరుగుతుంది.

నిందితుల వివరాలు

జగ్గయ్యపేట చెరువు బజార్ ప్రాంతానికి చెందిన బత్తుల కిషోర్ బాబు (25 సం),జగ్గయ్యపేట చెరువు బజార్ ప్రాంతానికి చెందిన భక్తుల వెంకట శివకుమార్ (19 సం),జగ్గయ్యపేట చెరువు బజార్ ప్రాంతానికి చెందిన బండి సాయి అంకమ్మరావు @ సాయి(19 సం),జగ్గయ్యపేట చెరువు బజార్ ప్రాంతానికి చెందిన బండి రవికుమార్ (23 సం),జగ్గయ్యపేట చెరువు బజార్ ప్రాంతానికి చెందిన వేముల జ్వాలా నరసింహారావు (23 సం),జగ్గయ్యపేట చెరువు బజార్ ప్రాంతానికి చెందిన రూపాన వినయ్ (19 సం),జగ్గయ్యపేట చెరువు బజార్ ప్రాంతానికి చెందిన ఒక జువైనల్

జరిగిన సంఘటనను తీవ్రంగా పరిగణించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి ఎస్.,వేగంగా దర్యాప్తు చేసి,నిందితులను అరెస్ట్ చేసి వారికి శిక్ష పడేవిధంగా చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు రూరల్ డిసిపి కేఎం మహేశ్వర రాజు ఐ.పి. ఎస్. పర్యవేక్షణలో నందిగామ ఏసిపి తిలక్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వారి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది.అక్కడ సేకరించిన సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి వారి కదలికలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కి రాబడిన పక్కా సమాచారం మేరకు జగ్గయ్యపేట పద్మావతి నగర్ చెక్సోస్ట్ వద్ద ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించి అరెస్టు చేయడం జరిగింది.మరో జవైనల్ ను అదుపులోనికి తీసుకుని విచారించడం జరిగింది.వివరాల్లోకి వెళ్తే.నిందితులందరూ ఒకే గ్రామానికి చెందినవారు వీరందరూ మద్యం మరియు చెడు వ్యసనాలకు బానిస లైనవారు,అదే గ్రామంలో నివసించుచున్న బత్తుల శ్రీను అనే అతను ఆ ఊరిలో పెద్దరికంగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడని,వీరు ఎవరితో అయినా గొడవ పడిన సమయంలో శ్రీను వచ్చి వీరిని గద్దించి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకున్నాడని, అతని వల్ల వీరికి ఎక్కడ గుర్తింపు ఉండటం లేదని ఏ విధంగానైనా అతని అడ్డు తొలగిస్తే వీరి గొడవలకు అడ్డు లేకుండా ఉంటుందని ఆలోచనతో స్నేహితులు అందరూ కలిసి పథకం వేసుకొని అతను చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శివరాత్రి సందర్బంగా వారందరూ కలిసి నిర్వహించుకునే ఊరేగింపులో వారితో గొడవ పెట్టుకుని ఈ గొడవల్లో చంపి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న పథకం ప్రకారం ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా శ్రీను మేనల్లుడు అయిన ఓర్సు నాగబాబు తో కావాలని ఉద్దేశ పూర్వకంగా గొడవ పెట్టుకుని, గొడవ పడుతున్న సమయంలో బత్తుల శ్రీను అడ్డు రాగా అందరూ కలిసి వారిని కొట్టి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వారి జేబులోని కోడి కత్తి సహాయంతో శ్రీను మెడపై మరియు వెనక పొడిచినారు. తర్వాత అతని అన్న బత్తుల వెంకటేశ్వర్లు ను కూడా కత్తి తో భుజం మీద పొడిచి అక్కడినుండి పారిపోయినారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here