Home public news నూతన క్రిమినల్ చట్టాలు -2023 పై అవగాహన కోసం పోలీసు సిబ్బందికి శిక్షణ. కమిషనర్...

నూతన క్రిమినల్ చట్టాలు -2023 పై అవగాహన కోసం పోలీసు సిబ్బందికి శిక్షణ. కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో

2
0

 ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ కార్యాలయము, విజయవాడ.

    తేదీ.06-03-2025

నూతన క్రిమినల్ చట్టాలు -2023 పై అవగాహన కోసం పోలీసు సిబ్బందికి శిక్షణ

ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనరేట్ పరిదిలోని పోలీసు సిబ్బంది అంధరూ పోలీసు విధులలో బాగంగా ప్రతి ఒక్క అంశంపై పూర్తి అవగాహన కలిగి నగర ప్రజలకు మెరుగైన సేవలను అంధించాలనే సదుద్దేశంతో నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో సిటీ ట్రైనింగ్ సెంటర్ ఏ.సి.పి. బి.ఉమా మహేశ్వర రెడ్డి వారి సిబ్బందితో కలిసి నగరంలోని పోలీసు అదికారులు మరియు సిబ్బందికి ప్రతి రోజూ ఏ.ఆర్.గ్రౌండ్ లోని సిటీ ట్రైనింగ్ సెంటర్ నందు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 

ఈ క్రమంలో 05-03-2025 నుండి 07-03-2025 తేదీలలో మూడు రోజులపాటు న్యూ క్రిమినల్ లా -2023 & ఇంపార్టెంట్ టు ఇన్వెస్టిగేషన్ ఎఫ్.ఐ.ఆర్. టు చార్జ్ షీట్ వరకు తీసుకోవాల్సిన చర్యల గురించి అన్నీ పోలీసు స్టేషన్ లోని 65 మంది సిబ్బందికి క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. ఈ శిక్షణలో నేర స్థలంలో ఆదునిక సాంకేతిక పరిజ్నానాన్ని ఉపయోగించుకుని ఏవిధంగా సాక్ష్యాలను సేకరించాలి అనే విషయంపై వివరించడం జరుగుతుంది. శిక్షణ అనంతరం సిబ్బందికి శిక్షణ ఇచ్చిన అంశంపై పరీక్ష నిర్వహించి శిక్షణ తీసుకున్న సిబ్బంది ఏవిధంగా పరిణీతి చెందారో గుర్తించడం జరుగుతుంది.

అదేవిధంగా ఇప్పటివరకు ది.03-03-2025 తేదీన ఏ.సి.పి.లు కె.లతా కుమారి , స్రవంతి రాయ్ ఆద్వర్యంలో ఉమెన్ హెల్ప్ డెస్క్ గురించి 39 మంది సిబ్బందికి పోలీసు స్టేషన్ కు వచ్చిన బాధిత మహిళలతో ఏవిధంగా వ్యవహరించాలి, వారికి ఏ విధంగా సహకరించాలి అనే విషయంపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ది.04-03-2025 తేదీన ప్రతి సోమవారం పోలీసు కమిషనర్ వారి కార్యాలయంనందు నిర్వహించు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.) కు వచ్చిన ఫిర్యాదుదారులతో ఏవిధంగా వారి సమస్యను చట్ట పరిదిలో త్వరితగతిన పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి 50 సిబ్బందికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది.       

ఈ సంధర్భంగా అడ్మిన్ డి.సి.పి. మాట్లాడుతూ. గత ఐదు సంవత్సరాల నుండి వివిద కారణాల చేత సిబ్బందికి ఆర్.సి.కోర్స్ లను నిర్వహించలేకపోయాము. ఇప్పుడు పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ప్రత్యేక చొరవ తీసుకుని కమిషనరేట్ పరిదిలోని పోలీసు సిబ్బంది అంధరూ పోలీసు విధులలో బాగంగా ప్రతి ఒక్క అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఈ శిక్షణలను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శిక్షణ ఇచ్చే ప్రతి అంశాన్ని పూర్తిగా తెలుసుకోవాలని ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే అధికారులను అడిగి తెలుసుకుని నివృత్తి చేసుకుని పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితులు/ ప్రజలకు మరుగైన సేవలు అందించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here