Home public news పుల్లశనగ సాగులో మెషీన్ కోతకు అనువైన రకాల గూర్చి రైతులు అవగాహన పెంచుకోవాలి

పుల్లశనగ సాగులో మెషీన్ కోతకు అనువైన రకాల గూర్చి రైతులు అవగాహన పెంచుకోవాలి

4
0

 వ్యవసాయశాఖ

        

 పుల్లశనగ సాగులో మెషీన్ కోతకు అనువైన రకాల గూర్చి రైతులు అవగాహన పెంచుకోవాలి

          డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ 

*)ఎండు తెగులు*

 తట్టుకునే రకాల గురించి రైతులకు మరింత ప్రచారం చేయాలి   

) గత కొన్నేళ్లుగా సాగులో వున్న *జేజీ 11 ( JG -11) కు ప్రత్యమ్మాయ రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలి.

    ది.07/03/2025 శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్,రాష్ట్రములో *శనగ సాగులో దిగుబడులు పెంచటానికి ఉత్తమ మేలైన యాజమాన్య పద్ధతులు మరియు నూతన సాంకేతిక ఆవిష్కరణలు* అనే అంశంపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు . 

రాష్ట్రములోని అపరాల సాగులో కేవలం ఒక్క పుల్లశనగ పంట విస్తీర్ణం ,ఉత్పత్తి లో *47 శాతం* ఆక్రమించింది అని డిల్లీ రావు తెలిపారు. 

    ఈ సమావేశంలో ఆచార్య యన్. జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పి వి సత్యనారాయణ,అపరాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మోహన్ రెడ్డి ,నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్ర వేత్తలు,పుల్ల శనగ సాగు విస్తీర్ణం ఎక్కువగా వున్న 10 జిల్లాల వ్యవసాయ అధికారులు,రైతులు మరియు కేవీకే శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు .

   నంద్యాల శాస్త్రవేత్త డాక్టర్ నీలిమ మాట్లాడుతూ శనగ సాగులో *జేజీ – 11* కు ప్రత్యమ్మాయముగా కొత్తగా ప్రధాన మంత్రి మోడీ తో ఆవిష్కరింపబడిన *యన్. బి. ఇ. జీ 1267 (N BeG 1267)* రకం ఉత్తమమైనదని , ఎండు తెగులును తట్టుకుని ,యంత్రముతో(మెషీన్) కోతకు అనువైన రకమని ,ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ ,కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రములోని రబీ సాగుకు అనువైన రకమని తెలిపారు.తరువాత స్ధానం నంద్యాల రకాలైన 857 ; 452; 776 ; 47 మరియు 49 రకములు రబీ సీజన్లో పుల్ల శనగకు ఎక్కువగా ఆశించే ఎండు తెగులును తట్టుకుని ,కోతకు కూలీల కొరతను అధిగమించేందుకు పైరు ఎదుగుదల నిలువుగా వుండి ,కాయలు ఒక అడుగు పైన ఏర్పడి మెషీన్ కోతకు అత్యంత అనుకూలమైనవిగా వున్నాయి అని డిల్లీ రావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు .

    మార్చి నెలలోని 30 డిగ్రీల కన్నా ఎక్కువుగా వుండే ఉష్ణోగ్రతలకు ,నీటి ఎద్దడికి నేలలో నివసించే ఫంగస్ 

శిలీంద్రం వల్ల శనగ పంటకు ఏ దశలోనైన *ఎండు తెగులు* ,*వేరు కుళ్ళు* ఆశించవచ్చని ,పంట ఎదుగుదల సమయములో ఈ ఎండుతెగులుని రసాయనిక శిలీంద్ర నాశినలతో నివారించడం అసాధ్యం కనుక సాగులో ఎకరాకు 2 కిలోల *ట్రైకోడర్మ విరిడీ* పొడిని 4 కిలోల వేపచెక్కతో కలిపి 100 కిలోల పశువుల ఎరువులో 15 రోజులు నాన బెట్టి ,వాటిని వృద్ధి చేసి పొలంలో జల్లు కొని ఎండు తెగులును,వేరు కుళ్ళును నివారించ వచ్చని తెలిపారు .

ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉప సంచాలకులు బాలు నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత రబీ లో రాష్ట్ర వ్యాప్తంగా 2,98,534 హెక్టార్ల విస్తీర్ణంలో శనగ సాగులో వుందని , *వైఎస్ఆర్ జిల్లాలో* ఎక్కువగా 76454 హెక్టార్లలో ,తరువాత స్థానములో అనంతపురం  61158 హెక్టార్లలో, మూడవ స్థానములో నంద్యాల 51630 హెక్టార్లలో సాగుచేస్తున్నారని తెలిపారు . 

    బనగానపల్లె కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్ర వేత్త సుధాకర్ మాట్లాడుతూ శనగ సాగు నీటి వసతి తక్కువుగా వున్న ప్రాంతాలలో ఆరు వరసల శనగకు ఒక వరస గొడ్డుసాలు తో విత్తటం ద్వారా నీటి ఎద్దడిని తట్టుకోవచ్చని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here