Home Political news భారతదేశం మహిళలు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని ప్రభుత్వ

భారతదేశం మహిళలు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని ప్రభుత్వ

4
0

 ప్రసాదం పాడు మార్చ్ 8  ప్రపంచ దేశాల్లో కంటే భారతదేశం మహిళలు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని ప్రభుత్వ

విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. శనివారం విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో టీడీపీ నాయకుడు గూడవల్లి నర్సయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలసి యార్లగడ్డ వెంకట్రావు కేక్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి కూటమి మహిళ నేతలను, మహిళ కార్మికులను, వివిధ రంగాలలో ప్రతిభ చాటిన మహిళలను ఘనంగా సత్కరించారు. అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గతంలో డాక్టర్ , ఇంజనీర్లుగా మహిళలు చాలా తక్కువగా ఉండేవారిని నేడు ఐటీ రంగంలో పురుషులు కంటే స్త్రీలు ఎక్కువగా పనిచేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. అందుకే సంక్షేమ పథకాలలోను మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు. రష్యా దేశంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున మహిళను గౌరవిస్తూ పురుషులే ఇంట్లో అన్ని పనులు చేస్తారని తెలిపారు. ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానిమంత్రిగా చేసి చరిత్ర నిలిచిపోయారన్నారు. 

సీఎం చంద్రబాబుకు గతంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతిపక్ష హోదా తొలగించేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు‌‌. జగన్ కు ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారానే అసెంబ్లీ ప్రతిపక్ష హోదా కోల్పోయారు తప్ప ఎవరు తీసేయలేదని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాదని తెలిసి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్,నారా లోకేష్ కూటమి ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో  

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వైసీపీలో చేర్చుకున్నట్లు 

తెలిపారు. ఇదే విషయాన్ని జగన్ స్వయంగా తనకు చెప్పారని యార్లగడ్డ వెల్లడించారు. మిగిలిన ఎమ్మెల్యేలు లొంగకపోవడం వల్లే మిన్నకుండిపోయారని.. యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయకపోవడంతో గ్రామాల్లో రహదారులు గుంతలమాయమయ్యాని చెప్పారు. పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి గుంతలమయమయిన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చే కార్యక్రమం చేస్తున్నారని చెప్పారు. జగన్ చేయలేని పని పవన్ చేస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలో 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేసినందుకు ప్రజల మన్ననలు పొందాలి తప్ప ఇలాంటి రాజకీయ విమర్శలు తగదని హితవు పలికారు.ఈ కార్యక్రమం లో రిటైర్డ్ ప్రిన్సిపల్ ఉప్పులూరి స్వర్ణకుమారి, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి మండవ లక్ష్మి, గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ, కృష్ణాజిల్లా అంగన్వాడి డ్వాక్రా విభాగం అధ్యక్షురాలు పొదిలి లలిత, గన్నవరం మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు చిక్కవరపు నాగమణి, కృష్ణాజిల్లా తెలుగు మహిళా అధికార ప్రతినిధి బొమ్మసాని అరుణకుమారి, గన్నవరం నియోజకవర్గ అంగన్వాడీ డ్వాక్రా విభాగం అధ్యక్షురాలు కంభంపాటి లక్ష్మి, కృష్ణాజిల్లా అంగన్వాడి డ్వాక్రా విభాగం అధికార ప్రతినిధి బుస్సే సరితా దేవి, గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు మండల స్వర్ణకుమారి, ఉంగుటూరు మండల తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి గుడ్డేటి సుమతి, తెలుగు మహిళలు దేవినేని సులోచన రాణి, దమయంతి, ఏ మల్లేశ్వరి, దాసరి రవళి, గుజ్జర్లపూడి అజిత, దాసరి శ్వేత, నూతి సుభాషిని, తుమ్మల నాగ శిరోమణి, లావణ్య, సాయి, బేతాళ ప్రమీల రాణి, బడుగు ఝాన్సీ, శాంతి, అన్ని జ్యోతిలక్ష్మి, రాధిక, సుజాత తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here