Home Political news నియోజక వర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను

నియోజక వర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను

2
0

 నియోజక వర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను

నా నియోజక వర్గం లో నిరసనలకు ధర్నా లకు తావు లేదు

విలువైన కామన్ సైట్లు కబ్జా కు గురి అవుతున్నాయి

గన్నవరం ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు

విజయవాడ రూరల్ అంబాపురం : నిరసనలు, ధర్నాలకు గన్నవరం నియోజకవర్గంలో ఆస్కారం లేదని ప్రతి నిమిషం నియోజవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడ నగర శివారు అంబాపురం పంచాయతీ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీలో కబ్జాకి గురైన 2500 గజాల విలువైన కామన్ స్థలాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిశీలించారు. అంబాపురం గ్రామస్తులతో కలిసి అంబాపురం పంచాయతీ పరిధిలో కబ్జా కు గురైన కామన్ సైట్ ముందు సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్థులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకొని అక్కడికి వచ్చి గ్రామస్తుల్ని సముదాయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగర శివారు ప్రాంతంలో గతంలో వేసిన లేఔట్లలోని కామన్ సైట్లపై కబ్జా రాయుళ్ల కన్ను పడటంతో గన్నవరం నియోజవర్గం విజయవాడ నగరానికి అనుకొని ఉండటంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయనీ అన్నారు . ఈ సమస్యపై త్వరలో అధికారులతో చర్చించి విలువైన భూములు కబ్జా కాకుండా కాపాడుతానని స్పష్టం చేశారు. వైసిపి హయంలో ఈ కబ్జా ప్రక్రియలు నిరంతరాయంగా కొనసాగాయనీ ఆరోపించారు. ఇటీవల ఓ కబ్జా చేసిన వ్యక్తి ఏకంగా అంబాపురం గ్రామ సర్పంచ్ పై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడంతో దానిపై పోలీసు ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాననీ… ఆ విషయం లో పోలీసులను తాను బెదిరించినట్లు కొన్ని మాధ్యమాలు వక్రీకరించి చూపించాయనీ మండిపడ్డారు. పోలీసు అధికారులు కూడా ఒకసారి ఆలోచించి పూర్తి వివరాలతో కేసులు నమోదు చేస్తే బాగుంటుందనీ సూచించారు. నియోజక వర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చిన తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here