Home public news ఆ రైళ్లను అందుకోవచ్చు మచిలీపట్నం ప్యాసింజర్ రైలు సమయాల మార్పు

ఆ రైళ్లను అందుకోవచ్చు మచిలీపట్నం ప్యాసింజర్ రైలు సమయాల మార్పు

3
0

 ఆ రైళ్లను అందుకోవచ్చు మచిలీపట్నం ప్యాసింజర్ రైలు సమయాల మార్పు

67268 ట్రెయిన్ సమయంలో మార్పు చేస్తూ ఉత్తర్వులు

మచిలీపట్నం నుంచి తెల్లవారుజామున 3గంటలకు బయలుదేరే ప్యాసింజర్ రైలు సమయాన్ని మార్పు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు.

 మచిలీపట్నంలో 3 గంటలకు బయలు దేరి విజయవాడకు 5 గంటలకు చేరుకునేది. దీంతో విజయ వాడ నుంచి శాతవాహన, రత్నాచల్, పినాకిని లాంటి ఎక్స్ ప్రెస్ రైళ్లతోపాటు గుడివాడ నుంచి ఎల్టీటీ, సర్కారు ఎక్స్ ప్రెస్లను అందుకోవడానికి అనువుగా ఉండేది. 

ఆ రైలు సమయాన్ని సుమారు రెండేళ్ల కిందట 3.50 గంటలకు మార్పు చేయడంతో విజ యవాడకు వెళ్లే సరికి 5. 55 గంటలు అవుతుండడంతో ప్రమాణికులు వివిధ ఎక్స్ ప్రెస్ రైళ్లను అందుకోలేకపోతున్నారు.

 మచిలీపట్నం, పెడన, గుడ్ల వల్లేరు, గుడివాడ తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు రెండేళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందులుపడుతున్నారు. పలువురు ప్రయాణికులు దీనిపై ఉన్నతాధికారులకు అర్జీలు కూడా అందించారు. ఈ సమస్యపై ఫిబ్రవరి 10న ‘ఆ రైళ్లను అందుకోవడం గగనమే’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనం ప్రచురిత మైంది. 

ఎట్టకేలకు స్పందించిన సికింద్రా బాద్ లోని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు ఆ రైలు సమయంలో మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఉదయం 5.55 గంటలకు విజయవాడ చేరుకునే ఈరైలు ఇకపై 5. 30 గంటలకే చేరుకుంటుంది. మారిన రైలు సమయాలు ఈనెల 13 నుంచి అమల్లోకి వస్తాయని మచిలీపట్నం రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ పామర్తి నాగేశ్వరరావు తెలిపారు.

స్టేషన్ బయలుదేరు సమయం

మచిలీపట్నం:3.25

చిలకలపూడి:3.30

పెడన:3.35

వడ్లమన్నాడు:3.40

కౌతవరం:3.45

గుడ్లవల్లేరు:3.50

గుడివాడ:4.30

తరిగొప్పల:4.45

ఉప్పులూరు:4.53

విజయవాడ:5.30

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here