విజయవాడ
10-03-2025
వైసిపి ఆధ్వర్యంలో మార్చ్ 12 న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే యువత పోరు పోస్టర్ ను ఆవిష్కరించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ కార్పొరేటర్లు
స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం నందు సోమవారం నాడు మాజీ మంత్రి, పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మార్చ్ 12న వైసిపి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే యువత పోరు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు, పశ్చిమ కార్పొరేటర్లు మండెపూడి ఛటర్జీ, యరడ్ల ఆంజనేయ రెడ్డి, షేక్ ఇర్ఫాన్, పడిగపాటి చైతన్య రెడ్డి, బాపతి కోటిరెడ్డి, గోదావరి గంగ బాబు, శిరంశెట్టి పూర్ణ చంద్రరావు, షేక్ హయత్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మార్చ్ 12న ఫీజ్ రీయంబర్స్మెంట్ పధకాన్ని అమలు చేయాలనీ కలెక్టర్ కార్యాలయం వద్ద వైసిపి ఆధ్వర్యంలో నిర్వహించే యువత పోరు పోస్టర్ ను నేడు మాజీ మాంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కార్యాలయం నందు ఆవిష్కరించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు అయిదు నెలలలోనే తీవ్రమైన వెతిరేకత మూటకట్టుకున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా సంక్షేమ పధకాలను అమలు చేసారో ప్రజలందరికి తెలుసన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో నిర్వహించిన సభలలో మూలాన కూర్చున్న ముసలమ్మ, మంచం మీద కూర్చున్న తాత కూడా బాటన్ నొక్కగలరన్నారు మరి నేడు చంద్రబాబు నాయుడు ఎందుకు నొక్కేలేకపోతున్నాడో చెప్పాలన్నారు. సూపర్ సిక్స్ అమలు చేస్తాము జగన్ కంటే ఒక రూపాయి ఎక్కువ ఇస్తామన్నా చెప్పిన వ్యక్తి, నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అన్ని చెప్పుకున్న వ్యక్తి, నాలుగు సార్లు ముఖ్యమంత్రి అన్ని చెప్పుకున్న వ్యక్తి, ఎన్నికల ముందు ఇన్ని హామీలు చేయలేమని, అబ్బదపు హామీలని, బూటకపు హామీలని ఇంత అనుభవం అనుకునే వ్యక్తి అప్పుడు ఎందుకు తెలియలేదు. ఇప్పుడు మేము అమలు చేయలేము చేతులెత్తేసి ప్రజలు అర్ధం చేసుకోవాలంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. నాడు నేడు స్కూల్ గాని, మిడ్ డే మీల్స్ గాని, స్కూల్ యూనిఫార్మ్ గాని, బ్యాగ్ లు గాని, ఇంగ్లిష్ మీడియం స్కూల్ గాని, టాబ్ లు గాని విద్యార్థులకు టాబ్ లు గాని, విద్యా దీవెన, వసతి దీవెన, ఫిజ్ రియంబర్స్మెంట్ వంటి అనేక పథకాలను జగన్ మోహన్ రెడ్డి అమలు చేసారని అన్నిటి కన్నా ముఖ్యమైనది విద్య మనం రేపటి తరాలకు ఉన్నతమైన విద్యను అందజేయకలిగితే అంతకన్నా వారికీ ఇచ్చే ఆస్థి ఇంకేమి ఉండదని ప్రతి నిమిషం విద్యావేత్తలుగా చేయడం కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం త్రైమాసికం నుంచి ఒక విడత కూడా ఫీజ్ రీయంబర్స్మెంట్ చెల్లించకపోవడం. డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులు ఫీజ్ లు చెల్లించకపోవడంతో పరీక్షలకు వెళ్ళేటపుడు ఫీజ్ బకాయిల పడకపోవడం వళ్ళ హాల్ టికెట్ లు కాలేజ్ యాజమాన్యాలు ఇవ్వకపోవడం, ఉద్యోగాలకి వెళ్లాలని సర్టిఫికెట్ లు అడుగుతుంటే ఫీజ్ చెల్లించాలని సర్టిఫికెట్ లు ఇవ్వకపోవడం వంటి జరుగుతున్నాయన్నారు. ఇంత నిర్లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్యార్థులపట్ల వ్యవహరిస్తుందన్నారు విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. నేటి విద్యార్థులే రేపటి భావితరం అని చెప్పుకునే విద్యార్థుల పట్ల కూటమి నేతలు విద్యార్థుల భవిష్యతుతో ఆడుకుంటుంన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మార్చ్ 12వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ఉదయం 9 గంటలకు యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాల్గొని విజయవంతం చేయాలన్నారు. గతంలో రైతన్నకు అండగా, కరెంట్ చార్జీల బాదుడు పై పోరుబాట వంటి కార్యక్రమాలు చేసిన తరువాత కూటమి ప్రభుత్వం దారిలోకి వచ్చి కొంత మంది రైతులకైనా డబ్బులు వేయడం జరిగిందన్నారు. ఇలా ప్రతి అంశం పై చురకులు వేస్తేనే ప్రభుత్వం కదులుతుందంటే మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క సమస్య పైన మా నాయకులతో కార్యకర్తలతో ప్రజలతో కలిసి రోడ్లెక్కి పోరుబాట చేస్తామన్నారు. 12వ తేదీ కోర్ట్ వద్ద నుంచి నడక దారిన బయలుదేరి కలెక్టర్ కి విద్యార్థుల ఫీజ్ బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞాపన పత్రం అందజేస్తామని తెలియజేసారు
దుర్గ గుడి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విద్యార్థుల పడుతున్న బాధలు, వారు అనుభవిస్తున్న మానసిక క్షోభ గురించి మార్చ్ 12వ తేదీన యువత పోరు పేరుతొ కలెక్టర్ కి వైసిపి నాయకులూ, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి వెళ్లి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు 2014 లో కూడా అమలు కానీ హామీలు ఇచ్చిన సందర్బాలు చూశామని రాష్ట్ర ప్రజలందరినీ ఏ రకంగా మోసం చేసారో మనందరం చూశామని, విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ ఎంత ఇబ్బందులకు గురయ్యారో మనందరం చూమన్నారు. 2019 లో మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత అందించిన పాలనను ప్రజలందరూ చూశారన్నారు. చంద్రబాబు నాయుడు మీరు అధికారంలోకి మీరు వచ్చి తొమ్మిది నెలలు అయిందని మీరు ఇస్తానన్న నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల చొప్పున 27 వేల రూపాయలను విద్యార్థులకు ఎప్పుడు ఇస్తారు అన్ని ప్రశ్నించారు. విద్యార్థులు చదువుకోవడానికి స్టైఫండ్ కింద మూడు వేల రూపాయలను ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పై ఉందన్నారు. ఫీజ్ రీయంబర్స్మెంట్ బకాయలు చెల్లించకపోవడం కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫీజ్ రీయంబర్స్మెంట్ రాలేదు మీరు డబ్బులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి తొమ్మిది నెలలోనే కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రజలు అనుకుంటున్నారన్నారు. వైసిపి ఆధ్వర్యంలో నిర్వహించే యువత పోరు కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి వైసిపి నాయకులూ వేలాదిగా వెళ్లి కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ తక్షణమే మీరు మీ పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసారు. లేదా ఈ సమస్యల పై స్పందించాలన్నారు. ప్రతి దానికి ఊగిపోయి పూనకం వచ్చినట్లు మాట్లాడి విమర్శలు చేసిన సందర్భాలను గతంలో మనం చూశామన్నారు. మేము పవన్ కళ్యాణ్ ఒకటే ప్రశ్నింతున్నాము యువత వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు పడుతున్న బాధలను మీకు కనపడడం లేదా అన్నీ ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలు పడుతున్న బాధలు మీకు కనపడడం లేదా చిన్న పిల్లల పై కూడా ప్రతి మూడు గంటలకు ఒక హత్యాచారాలు జరుగుతున్నాయని ఇవ్వని మీకు కనపడడం లేదా అన్ని ప్రశ్నించారు. లా అండ్ ఆడార్ ని గాలికొదిలేశారని లా అండ్ ఆడర్ ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాము. ఎన్నో మాటలు మాట్లాడి దొంగ హామీలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారని. మీ పార్టీ స్థాపించింది మీ అన్నకి మీకు మంత్రులు అవ్వాలని కూటమి పార్టీలు తెలుగు దేశం, బిజెపి లతో ఉంటేనే అది సాధ్యమని గ్రహించి వాళ్లతో కలిసి ఉన్నారన్నారు. గతంలో మీరు రెండు చోట్ల పోటీ చేసి ఏ ఒక్క చోట గెలవలేకపోయారన్నారు. మీరు జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చేయాలనీ లేకపోతె వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరుపున పోరాటలు చేస్తామని తెలియజేస్తున్నాము. ఇప్పుడు చేసేవన్నీ ట్రయల్స్ మాత్రమేనని రాబోయే రోజుల్లో రోడ్లెక్కి ఉద్యమాలు చేసి కూటమి ప్రభుత్వ మెడలు వంచి మరి హామీలు అమలు చేసే విధంగ కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు
55వ డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ గతంలో జగన్ మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలలో 100 శాతం అడ్మిషన్ అయ్యి విద్యార్థులు చదువుకునేవారని కానీ నేడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందన్నారు. చంద్రబాబు అధికారం లోకి వచ్చిన తరువాత విద్యని ప్రయివేటీకరణ చేసే విధంగానే చర్యలు కనపడుతున్నాయన్నారు. పేదవారికి విద్యను ఏ విధంగా అందించాలని చర్యలు తీసుకోకుండా ప్రజల నడుముల పై తంతున్నారన్నారు. మా ప్రాంతంలో చుస్తే ఎస్సి ఎస్టీ మైనారిటీలు ఎక్కువ ఉంటారని వారి విద్యను అభ్యసించడం కోసం అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారన్నారు. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయకుండా తుంగలోకి తొక్కారన్నారు. చంద్రబాబు నాయుడు విద్యార్థులను మోసం చేశారన్నారు ముందునుంచి వెన్నుపోటు ధోరణితోనే ముందుకు సాగుతున్నారని ముందుగా మామకు వెన్నుపోటు పొడిచిందని, 2014 నుంచి 2019 వరకు ప్రజలను వెన్నుపోటు పొడిచాడని మరల ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పొడవాడనికి సిద్ధంగా ఉన్నాడని అన్నారు ఈ సారి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోరుబాట చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. భారత దేశం లో మెడికల్ కాలేజ్ లు పెంచుతామని మెడికల్ సీట్ లు పెంచుతామని ప్రధాన మంత్రి చెపుతూ వచ్చారని. జగన్ మోహన్ రెడ్డి ముందు చూపుతో 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేపించి తీసుకువచ్చారని దానిలో 5 మెడికల్ కాలేజ్ లు పూర్తి చేసారని మిగిలిన 12 కూడా చాలవరకు పనులు పూర్తి అయ్యాయని వాటిని కూడా తుంగలోకి తొక్కే పరిస్థితి చంద్రబాబు తీసుకువచ్చాడని ఎందుకంటే వాళ్ళ ఎల్లో బ్యాచ్ కి లాభాలు రావాలని, మెడికల్ కాలేజ్ లు నడిపే వారిని లాభాల్లోకి నడిపించాలంటే గవర్నమెంట్ ద్వారా వచినటువంటి మెడికల్ కాలేజ్ లను తుంగలోకి తొక్కాలి వాళ్లకు ఫీజ్ లు ఎక్కువుగా రప్పించి లాభాలు చేకూర్చే విధంగా చంద్రబాబు చర్యలు ఉన్నాయన్నారు. పేదవారికి మెడికల్ కాలేజ్ ఎక్కువుగా సీట్లు వస్తాయని దాని వల్ల ఫీజ్ లు కూడా తక్కువుగా ఉంటాయి అన్నే ఉద్దేశం జగన్ మోహన్ రెడ్డి ది అయితే చంద్రబాబు యొక్క ఆలోచనలు ఎప్పుడు చుసిన ప్రయివేటు వారికీ ఏ విధంగా దోచి పెట్టాలి పేద ప్రజల నడ్డి ఎలా విరచాలి అనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారని. అన్ని వర్గాల వారు తిరగబడే రోజులు దెగ్గరలోనే ఉన్నాయని ఇప్పటి కైనా చంద్రబాబు తన పద్దతిని మార్చుకోవాలని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ SC లో నేను పుట్టాలి SC లోనే నేను రెల్లిలో పుట్టాలి అన్ని అన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ ఎస్సి కి మీరు న్యాయం చేసారో చెప్పాలన్నారు. కనీసం గత ప్రభుత్వం లో ఇచ్చినటువంటి కార్పొరేషన్లు కూడా ఈ ప్రభుత్వంలో ఇవ్వడానికి ముందుకు రావడంలేదన్నారు. మాలలాకు అనాయాయం చేసాడు, మాదిగలకు అన్యాయం చేసాడు, రెల్లీలకు అన్యాయం చేస్తున్నాడన్నారు. గతం లో జగన్ మోహన్ రెడ్డి అడగకుండానే రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెల్లిల యొక్క ఆత్మ గౌరవాన్నీ పెంచారన్నారు. చంద్రబాబు పక్కన కూర్చొని పవన్ కళ్యాణ్ కూడా మాయ మాటలు చెపుతున్నాడన్నారు.
42వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లల్లో జగన్ మోహన్ రెడ్డి హయాంలో పేద విద్యార్థుల గురించి వారి యొక్క భవిష్యత్తు గురించి పేదల పక్షాన జగన్ మోహన్ రెడ్డి నిలబడ్డారన్నారు. ఫీజ్ రియంబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలకు వేల కోట్లు వెచ్చించి వారి యొక్క చదువులకు ప్రాధాన్యత ఇచ్చి పధకాలను అమలు చేసిన పరిస్థితిని మనమందరం చూశామన్నారు. వాళ్ళందరి చదువులు మధ్యలో ఉన్నాయని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఫీజ్ లు చెల్లించకపోవడంతో హాల్ టికెట్ లు ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యం వారిని కాలేజ్ నుంచి పంపించే పరిస్థితి చూస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిందన్నారు. అమ్మఒడి ఎత్తేసి తల్లికి వందనం ఇస్తానన్నారు. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి పెద విద్యార్థుల చదువే నాకు ముఖ్యమని ఎప్పుడు లేని విధంగా ఫీజ్ రీయంబర్స్మెంట్ పధకాన్ని అమలు లోకి తీసుకువచ్చారని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఫీజ్ రీయంబర్స్మెంట్ పధకాన్ని ఎత్తేశారన్నారు. మరల జగన్ మోహన్ రెడ్డి 2019 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజ్ రీయంబర్స్మెంట్ పధకాన్ని అమలులోకి తీసుకువచ్చారని 93 శాతం పేద విద్యార్థులందరికీ కూడా చదువుకునే అవకాశం కల్పిస్తే నేడు మూడు పార్టీలు కలిసి ఎదో సాధిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తరువాత మల్లి అన్ని పధకాలను ఎత్తేయడం జరిగిందన్నారు. పేద విద్యార్థుల నోట్లో మట్టి కొట్టారని పేద విద్యార్థులను చుస్తే బాధ వేస్తుందనీ వారి యొక్క చదువులు ఏమవుతాయని ఆలోచించే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. విద్యకి వైద్యానికి జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో పెద్ద పీఠ వేసారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లను ప్రయివేటీకరణ చేసే యోచనలో ఉందని తక్షణమే దానిని ఉపసంహరించుకోవాలన్నారు.