వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు కు అందరు సంసిద్ధం కావాలని సూచించిన దేవభక్తుని చక్రవర్తి
మన YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం తలపెట్టిన యువత పోరు కార్యక్రమనికి సంబంధించి మన పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తి మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు కలిసి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
అనంతరం చక్రవర్తి మీడియా సమావేశం లో మాట్లాడుతూ
మన మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చకుండా వంచించి నందుకు నిరసన గా MARCH 12వ తారీఖున మన జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించే కార్యక్రమం నిర్వహింస్తున్నామని తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో ఫీజు రియింబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన 4,600 కోట్ల బకాయిలను విడుదల చేయాలనీ విద్యార్థులు మరియి వారి తల్లిదండ్రులు
ఎన్నికల మేనిఫెస్టో లో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ యువతకు ఇస్తానన్న నిరోద్యోగ భృతి ఇవ్వాల్సినదిగా నిరుద్యోగ యువత
కొత్త మెడికల్ కాలేజీ లు ప్రైవేటికరణ తక్షణమే ఉపసంహారించుకోవలసినదిగా పెద విద్యార్థులు మరియు తల్లిదండ్రులు
కూటమి ప్రభుత్వం పై నిరసన గళం విప్పుతూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించే కార్యక్రమం లో అందరు కలిసికట్టుగా పాల్గొనవలసినదిగా తెలియజేసారు.