Home Political news రాజ‌ధానిలో గ‌తంలో భూములు పొందిన 13 సంస్థ‌ల‌కు ఆయా కేటాయింపులు ర‌ద్దు చేస్తూ మంత్రివ‌ర్గ ఉప‌సంఘం...

రాజ‌ధానిలో గ‌తంలో భూములు పొందిన 13 సంస్థ‌ల‌కు ఆయా కేటాయింపులు ర‌ద్దు చేస్తూ మంత్రివ‌ర్గ ఉప‌సంఘం నిర్ణ‌యం తీసుకుంది

3
0

 Dt…10-03-2025.

అమ‌రావ‌తి

రాజ‌ధానిలో గ‌తంలో భూములు పొందిన 13 సంస్థ‌ల‌కు ఆయా కేటాయింపులు ర‌ద్దు చేస్తూ మంత్రివ‌ర్గ ఉప‌సంఘం నిర్ణ‌యం తీసుకుంది

..వివిధ కారణాల‌తో కేటాయింపులు ర‌ద్దున‌కు సబ్ క‌మిటీ ఆమోద ముద్ర వేసింది…అమ‌రావ‌తిలో సంస్థ‌ల‌కు భూముల కేటాయింపుల‌కు సంబంధించి మంత్రివ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశం స‌చివాల‌యంలో జ‌రిగింది…రెండో బ్లాక్ లోని మొద‌టి అంస్థులో జ‌రిగిన ఈ స‌మావేశానికి మంత్రులు పొంగూరు నారాయ‌ణ‌,ప‌య్యావుల కేశవ్,కందుల దుర్గేష్,కొల్లు రవీంద్ర‌,టీజీ భ‌ర‌త్ తో పాటు మున్సిప‌ల్ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్ కుమార్,సీఆర్డీఏ క‌మీష‌న‌ర్ క‌న్న‌బాబు, ఇత‌ర అధికారులు హాజ‌ర‌య్యారు..2014-19 మ‌ధ్య కాలంలో అమ‌రావ‌తిలో భూములు కేటాయించిన సంస్థ‌ల విష‌యంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ స‌బ్ క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంది..ఈ స‌మావేశం ముగిసిన త‌ర్వాత మంత్రులు నారాయ‌ణ‌,పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు..

అమ‌రావ‌తిలో గతంలో 131 సంస్థ‌ల‌కు భూములు కేటాయించిన‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు… వీటిలో 31 సంస్థ‌ల‌కు గ‌తంలో చేసిన కేటాయింపులు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు…మ‌రో రెండు సంస్థ‌ల‌కు గ‌తంలో ఇచ్చిన చోట కాకుండా వేరొక చోట కేటాయింపులు చేస్తూ స‌బ్ క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు..ఇక 16 సంస్థ‌ల‌కు  గ‌తంలో కేటాయింపులు చేసిన విస్తీర్ణంలో మార్పులు చేయ‌డంతో పాటు వేరొక ప్రాంతాల్లో కేటాయింపులు చేస్తున్నామ‌న్నారు..ఇక 13 సంస్థ‌ల‌కు వివిధ కార‌ణాల‌తో భూకేటాయింపులు ర‌ద్దుకు స‌బ్ క‌మిటీ అంగీకారం తెలిపింద‌ని మంత్రి చెప్పారు.వైసీపీ ప్ర‌భుత్వం క‌క్ష సాధింపుతో మూడు ముక్క‌లాట ఆడి రాజ‌ధానిని ప‌క్క‌న ప‌డేసింది..అప్ప‌ట్లోనే 43 వేల కోట్ల‌కు విలువైన ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచి 9 వేల కోట్ల విలువైన ప‌నులు పూర్తి చేసామ‌న్నారు…అయితే వైసీపీ క‌క్ష సాధింపుతో అమ‌రావ‌తి పై మూడు ముక్క‌లాట ఆడింది…కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత అనేక న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి 8 నెల‌లు ప‌ట్టింది.48 వేల కోట్ల విలువైన ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచి ఇప్ప‌టికే ఏజెన్సీల‌ను ఎంపిక చేసాం.సీఆర్డీఏ అధారిటీ స‌మావేశంలో ఆమోదం పొంద‌గానే ఆయా సంస్థ‌ల‌తో సీఆర్డీఏ అగ్రిమెంట్లు చేసుకుంటుంది…ఆ వెంట‌నే రెండు మూడు రోజుల్లో అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు మంత్రి నారాయ‌ణ‌..ఎన్నిక‌ల కోడ్ ఉండ‌టంతో టెండ‌ర్ల ప్ర‌క్రియ ఆల‌స్యం అయిందని మ‌రోసారి స్ప‌ష్టం చేసారు మంత్రి.

*భూముల అమ్మకం ద్వారానే అమ‌రావ‌తి నిర్మాణం…ప‌య్యావుల కేశ‌వ్.

రాజ‌ధాని కోసం ప్ర‌జ‌ల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌డం లేదని మంత్రి కేశ‌వ్ తెలిపారు.భూముల అమ్మకాల‌తో మాత్ర‌మే అమ‌రావ‌తి నిర్మాణం జ‌రుగుతుందని…ఖ‌జానాపై భారం లేకుండా సీఎం చంద్ర‌బాబు మంచి మోడ‌ల్ డిజైన్ చేసారని చెప్పారు…గ‌తంలో అమ‌రావ‌తి కోసం జ‌గ‌న్ ల‌క్ష కోట్లు కావాల‌ని ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని…ల‌క్ష కోట్లు అవ‌స‌రం లేకుండానే రాజ‌ధాని నిర్మిస్తున్నామ‌ని మంత్రి ప‌య్యావుల అన్నారు..

వైసీపీ ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టి వారితో ఆడుకున్నారని ఎద్దేవా చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here