విజయవాడ నగరపాలక సంస్థ
11-03-2025
నగరంలోని మ్యాన్ హోల్స్ అన్ని రోడ్ లెవెల్ లో ఉండాలి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు*
నగరంలోని మ్యాన్ హోల్స్ అన్ని రోడ్ లెవెల్ లో ఉండాలి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యాటంలో భాగంగా కేదారేశ్వరపేట వాటర్ ట్యాంక్,, పూర్ణానంద పేట, బాప్తిష్ట పాలెం, ఖుద్ధుస్ నగర్, పెజోని పేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న మాన్ హోల్స్ అన్ని అధికారులు పర్యటించి రోడ్ లెవెల్ లో ఉంచాలని, సైడ్ డ్రెయిన్లన్నీ ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేసుకుంటూ నగరంలో ఉన్న డ్రైనలలో పూడికలు తీయాలని, కల్వర్ట్ మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి శ్రీ వెలగపూడి లక్ష్మణ దత్తు ప్రాథమిక పాఠశాల పర్యటించి అక్కడున్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాలలో పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విజయవాడ నగర పాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాలని కల్పించాలని మరుగుదొడ్లు, నీటి సరఫరా, పరిశుభ్రత కచ్చితంగా ఉండేటట్టు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చూసుకుంటూ ఉండాలని అన్నారు.
ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు తరచుగా యం ఎల్ ఆయిల్ కాలువల్లో స్ప్రే చేసుకుంటూ, ప్రజలకు డ్రై డే గురించి అవగాహన కల్పిస్తూ, ఇంటి పరిసరాల్లో ఉన్న నీటిని, నిల్వ లేకుండా చూసుకోవాలని, కల్వర్ట్ వద్ద ఫకింగ్ చేసుకుంటూ నిరంతరం యాంటి లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తుండాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి ధర్నా చౌక్ వద్ద గల అన్న క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్న క్యాంటీన్లో ప్రజలకు వచ్చే ఆహారంలో నాణ్యత నిరంతరం పరీక్షించాలని. నిర్ణీత టోకెన్లు ఇస్తున్నారా లేదా, మరుగుదొడ్లు, నేటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ కచ్చితంగా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఇన్చార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.