ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ
ది.12.03.2025
మహిళా భద్రతలో బాగంగా లేడీస్ హాస్టల్స్ యజమాన్యాలతో సమావేశం నిర్వహించిన అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత
ఐ.పి.ఎస్
పోలీస్ కమీషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు ఐ.పి.ఎస్ ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పోలీస్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఎన్.టి.ఆర్.జిల్లా నందు దొంగతనాలు మరియు ఇతర నేరాలు జరుగకుండా నేర రహిత జిల్లాగా తీర్చిదిద్ది నగర ప్రజలకు మర్రిన్ని సేవలను అంధిచాలనే సదుద్దేశంతో సాంకేతిక పరిజ్ఞానంను ఆయుధంగా చేసుకుని ఎన్.టి.ఆర్ పోలీసు కమిషనరేట్ ను సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికె తలమానికంగా నిలబెట్టాలనే ధ్యేయంతో స్మార్ట్ గా వ్యవహరిస్తూ టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రజలలో సేఫ్టీ కల్చర్ తీసుకురావడమే లక్ష్యం గా చేసుకుని 1.సురక్ష 2. E-Pahara, 3. Cyber citizens, 4. AsTram, 5. Victim compensation, 6. Cloud patrolling (Drone camera flying), 7. Traffic Ambassadors, 8. Falcon, 9. Cheruva, మొదలగు పలు అద్బుతమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
ఈ క్రమంలో పలు కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు వివిధ సంస్ధల మరియు యజమాన్యాలకు సేఫ్టీ కల్చర్ పై అవగాహన కల్పించడం ద్వారా నేరాలను కొంత వరకు నిరోదించవచ్చు అనే సద్దుద్దేశంతో మరియు ప్రజల మేలును ఎల్లప్పుడూ ప్రాధాన్యంగా తీసుకొని, సురక్షితమైన మరియు శాంతిమయమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయు కార్యక్రమంలో బాగంగా నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు అడ్మిన్ డి.సి.పి కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్. ఈ రోజు పోలీసు కమిషనర్ వారి కార్యలయం లోని కాన్ఫరెన్స్ హాలు నందు నగరంలో లేడీస్ హాస్టల్స్ నిర్వహించు సుమారు 150 మంది యజమానులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సంధర్భంగా అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.మహిళా భద్రత కోసం పోలీసు కమిషనర్ ఆద్వర్యంలో సురక్షా కమిటీలు, E-Pahara, Cloud Patrolling మొదలైనవి నిర్వహించడంతో పాటు, ప్రజలకు వివిద అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యం చేయడం జరుగుతుంది. మహిళా భద్రత నేపధ్యంలో హాస్టల్స్ నందు మరియు పరిసర ప్రాంతాలలో తప్పని సరిగా సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఉన్న కెమెరాలు రిపేరులో ఉంటే వాటిని రిపేరు చేయించి నిత్యం మానిటర్ చేసేవిధంగా చూడాలని, మీ హాస్టల్స్ పరిసర ప్రాంతాలలో ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే వెంటనే సంబందిత అధికారులకు తెలియజేయాలని, ఈ విషయాలను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని తెలియజేసారు.