ఎన్టీఆర్ జిల్లా, మార్చి 17, 2025
అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను అగ్రగామిగా నిలపండి
మండల, డివిజన్ స్థాయిలోనూ గ్రీవెన్స్ డేను సమర్థవంతంగా నిర్వహించండి
జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 133 అర్జీలు
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు నిబద్ధతతో కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు మొత్తం 133 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 43, పోలీస్ శాఖకు 26 అర్జీలు వచ్చాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 12, పౌర సరఫరాల శాఖకు 6, డీఆర్డీఏకు 6 అర్జీలు రాగా పంచాయతీరాజ్ శాఖకు 5 అర్జీలు అందాయి. ఉపాధి కల్పన, వైద్య ఆరోగ్య శాఖలకు నాలుగు చొప్పున, ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖలకు సంబంధించి మూడు చొప్పున అర్జీలు వచ్చాయి. ఏపీసీపీడీసీఎల్, విభిన్న ప్రతిభావంతులు, గృహ నిర్మాణం, ఐసీడీఎస్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కు రెండు చొప్పున అర్జీలు రాగా.. వ్యవసాయం, బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమం, సహకార సొసైటీ, దేవాదాయ, మత్స్య, అటవీ, బ్యాంకింగ్ సేవలు, ఆర్ అండ్ బీ, సాంఘిక సంక్షేమం, సర్వే శాఖలకు ఒకటి చొప్పున అర్జీలు వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలన్నారు. ఎప్పటికప్పుడు లాగిన్లో ఉన్న అర్జీలతో పాటు డ్యాష్బోర్డులోని స్థితిగతులను పరిశీలించాలని సూచించారు. డివిజనల్, మండలస్థాయిలోనూ గ్రీవెన్స్డేను సమర్థవంతంగా నిర్వహించాలని, అర్జీల పరిష్కారంపై క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని.. ఇందుకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.