Home public news విజయవాడలో రాష్ట్రస్థాయి భూవ్యవస్థాపన దిశా నిర్దేశక సదస్సు

విజయవాడలో రాష్ట్రస్థాయి భూవ్యవస్థాపన దిశా నిర్దేశక సదస్సు

5
0

 విజయవాడలో రాష్ట్రస్థాయి భూవ్యవస్థాపన దిశా నిర్దేశక సదస్సు 

విజయవాడ: భూసంబంధిత పెండింగ్ సమస్యలను మూడునెలల్లోపుగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ (లాండ్స్)శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా తెలిపారు. రాష్ట్రంలోని భూవ్యవస్థాపన విధానాలను బలోపేతం చేయడం, డిజిటల్ భూవ్యవస్థాపనను మెరుగుపరచడం, సమర్థవంతమైన పరిపాలనా విధానాలను అమలు చేయడం లక్ష్యంగా రాష్ట్రస్థాయి భూవ్యవస్థాపన దిశా నిర్దేశక కార్యక్రమం శుక్రవారం విజయవాడ, గవర్నర్‌పేట, సిటీ సివిల్ కోర్టు సమీపంలోని ఫార్మర్స్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించబడింది. జయలక్ష్మి, సిసిఎల్ ఏ ఈ కార్యక్రమానికి కీ నోట్ స్పీకర్‌గా హాజరై ప్రసంగించారు. 

సిసోడియా మాట్లాడుతూ భూవ్యవస్థాపనకు సంబంధించిన అన్ని రెవెన్యూ కార్యక్రమాలు జాయింట్ కలెక్టర్‌ల నేరుగా పర్యవేక్షణలో ఉంటాయని స్పష్టం చేశారు. డేటా ఎంట్రీలో ఖచ్చితత్వం కీలకమని, ఏవైనా నిర్లక్ష్యంగా లేదా తప్పుగా నమోదు చేసిన సమాచారం ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. భూవ్యవస్థాపనకు సంబంధించిన చట్టాలు ఇప్పటికే స్పష్టంగా ఉన్నందున రాష్ట్రస్థాయిలో అదనపు స్పష్టత అవసరం లేదని పేర్కొన్నారు. భూవ్యవస్థాపన సక్రమంగా జరిగేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఇందుకు డిజిటల్ పాలన, సమర్థవంతమైన విధానాలు, ఖచ్చితమైన భూ రికార్డులు కీలకమని తెలియజేశారు. పబ్లిక్ ట్రస్ట్ పెంచేందుకు పారదర్శకత, ఖచ్చితమైన అమలు విధానం అవసరమని, జాయింట్ కలెక్టర్‌లు అన్ని చర్యలను నేరుగా పర్యవేక్షిస్తారని అన్నారు.

జయలక్ష్మి మాట్లాడుతూ భూసంబంధిత ప్రక్రియలను సులభతరం చేయడం, ముఖ్యంగా వెబ్ ల్యాండ్, ఫ్రీహోల్డ్ హౌస్ సైట్లు, హౌస్ సైట్ల కేటాయింపువంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలియజేశారు. ఈ క్రమంలో ఐదుగురు సభ్యులతో కూడిన నాలుగు చిన్న గ్రూపులను ఎంపిక చేసి ఈ విషయాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే వేసిన లేఅవుట్ లలో అదనంగా, ఖాళీ భూమి అందుబాటులో ఉంటే, దాన్ని కొత్త హౌస్ సైట్ల కేటాయింపుకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

అదనపు సిసిఎల్ఏ, సెక్రటరీ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి రిసర్వే, భూ హక్కులు, ఆక్రమణలు, డిజిటల్ భూవ్యవస్థాపన వ్యవస్థలు వంటి కీలక అంశాలపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. స్వయంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సంయుక్త కలెక్టర్స్ అనుమానాలను నివృత్తి చేశారు. జాయింట్ కలెక్టర్‌లు, రెవెన్యూ డివిజనల్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here