Home Crime News మినిస్టరీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్&గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వారి సహకారంతో డ్రగ్స్ అబ్యూస్...

మినిస్టరీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్&గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వారి సహకారంతో డ్రగ్స్ అబ్యూస్ పై పోలీస్ సిబ్బంది

4
0

 ఎన్.టి.ఆర్ జిల్లా  పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ తేది.21-03-2025

మినిస్టరీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్&గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వారి సహకారంతో డ్రగ్స్ అబ్యూస్ పై పోలీస్ సిబ్బంది

అధికారులకు వర్క్ షాప్ నిర్వహించిన ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

మాదక ద్రవ్యాల వినియోగ సమస్యను ఎదుర్కొనటానికి ముందడుగు వేసే లక్ష్యంతో గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వారి సహకారంతో డ్రగ్ అబ్యూస్ పై విజయవాడ లోని పోలీసు కమిషనర్ వారి కార్యలయంనందు  పోలీస్ అధికారులకు సిబ్బంది వర్క్ షాప్ నిర్వహించిన ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ 

ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్  మాట్లాడుతూ”మాదకద్రవ్య వినియోగం వ్యక్తులను మాత్రమే కాదు, కుటుంబాలను, సమాజాన్ని కూడా నిర్వీర్యం చేస్తుందని. ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ సరఫరా చేసే వారి ఆటకట్టించడానికి ఎల్లవేళల పోలీసు అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉండాలని దీనికోసం తొందరలో అందరూ సలహాలు తీసుకొని పటిష్టమైన ఎస్.ఓ.పి రూపొందించడం జరుగుతుందని,* అదేవిధంగా డ్రగ్స్ వినియోగించే వారిని వాటినుండి ఎలా డీఅడిక్ట్ చేయడం గురించి కూడా ఇతర శాఖల సమన్వయంతో ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని. ప్రస్తుతం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్య వినియోగ సమస్యను ఎదుర్కోవడానికి టాస్క్ ఫోర్స్, ఈగల్ టీం, నార్కోటిక్ సెల్, వంటివి పనిచేస్తున్నాయని త్వరలో ఇవే కాకుండా సరికొత్త ప్రణాళికతో కమిషనరేట్ నందు మాదక ద్రవ్య వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని లక్ష్యంతో ఈ వర్క్ షాప్ ఈరోజు నిర్వహించడం జరుగుతుందని కాబట్టి దీనిపై అందరూ అవగాహన పెంచుకొని వీటిని అరికట్టడానికి అందరూ అంకితభావంతో పనిచేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వరాజ్యలక్ష్మి  మాట్లాడుతూ.

డ్రగ్స్ తీసుకునే వారిలో కొంతమంది మొదటిగా సిగరెట్ ఆల్కహాల్ వంటి వాటి ద్వారా ప్రారంభించి యాంగ్జైటీ మరియు బాధ మరియు ఒత్తిడి ఒంటి కారణాలతో డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని  డ్రగ్స్ తరచుగా వినియోగించేవారు మెదడులోని రివార్డుపాత్వే అనే భాగం సిగ్నల్ ఇవ్వడం ద్వారా తరచుగా వాటికి అలవాటు పడి చివరిగా బానిసలు అవుతున్నారు ఈ డ్రగ్స్ వలన  మానసికంగా శారీరకంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయని మన శరీరంలోని లంగ్స్ కిడ్నీ మెదడు కళ్ళు వంటి అవయవాలు దెబ్బతింటాయని అంతేకాకుండా క్యాన్సర్ లుకేమియా వంటి వ్యాధులు రావడం , అవయవాలు పనిచేయకపోవడం వంటివి కొన్ని కేసుల్లో మరణాలు కూడా సంభవించే అవకాశం ఉన్నదని, ప్రస్తుతం పాత గవర్నమెంట్ హాస్పిటల్ నందు సైక్రియాటిక్ విభాగం నందు డి అడిక్షన్ పై చికిత్స అందజేయడం జరుగుతుందని అన్నారు.

డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డాక్టర్   కళ్యాణి  ఈ వర్క్ షాప్ నందు పోలీస్ అధికారులకు సిబ్బందికి ఎన్. డి. పి. ఎస్ యాక్ట్ ద్వారా కేసులు నమోదు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు 2022 సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏ విధంగా కేసు నమోదు మరియు నమూనా సేకరణ వారి వైద్య పరీక్షలు ప్రాసిక్యూషన్ వంటి వాటిలో మెళుకువలు జాగ్రత్తలు వంటి వాటిని వివరించడం జరిగింది.

అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారకులైన ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ కి మరియు గ్రీన్ వ్యాలీ  ఫౌండేషన్ చైర్ పర్సన్  ఉమారాజ్ కి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డాక్టర్ కళ్యాణి కి  డాక్టర్ స్వరాజ్యలక్ష్మి కి ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ అడ్మిన్ డి.సి.పి  జి.వి సరిత ఐ.పి.ఎస్  వోట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ తో పాటుగా అడ్మిన్ డి.సి.పి  జి.వి సరిత ఐ.పి.ఎస్  గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్ పర్సన్  ఉమారాజ్  డాక్టర్ స్వరాజ్యలక్ష్మి  ఓల్డ్ జి.జి.హెచ్ టాస్క్ ఫోర్స్ ఎ.డి.సి.పి   ఎ.శ్రీనివాస రావు ,సి.టి.సి.ఎ.సి.పి.  ఉమామహేశ్వరరెడ్డి టాస్క్ ఫోర్స్ ఎ.సి.పి   కిరణ్  వివిధ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here