విజయవాడ
22-03-202
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి
స్థానిక 38వ డివిజన్ కుమ్మరిపాలెం సెంటర్ వద్ద గల తాజ్ మస్జీద్ వద్ద వైసిపి రాష్ట్ర నాయకులు షేక్ హయత్ ఆద్వర్యంలో శనివారం నాడు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ముస్లిం సోదరులు, వైసిపి నాయకులతో కలిసి మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్బంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అల్లా అశీసులతో అందరు చల్లగా ఉండాలని ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనటం చాల సంతోషంగా ఉందన్నారు
ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇర్ఫాన్, వైసిపి నాయకులు నజీర్, మహ్మద్ గౌసి, ఇర్ఫాన్, గౌస్ బాషా, ఫారూక్, రవూఫ్, సర్దార్ జానీ, తదితరులు పాల్గొన్నారు